ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు
చిలకలూరిపేట :- ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారానికి స్పీడును పెంచాయి. అందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం కార్యక్రమం పూర్తి చేయగా, నారా భువనేశ్వరి కూడా తన వంతు పార్టీ గెలుపుకై పనిచేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శంఖారావం, రా కదలిరా, జయహో బిసి వంటి భారీ బహిరంగ కార్యక్రమాలను నిర్వహించగా అందులో భాగంగానే ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ & జనసేన ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ సభ రాజకీయ చరిత్రలోనే మరువలేని ఘట్టంగా ఉంటుందని అచ్చం నాయుడు తెలిపారు. ఈ చిలకలూరిపేట సభ నుండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కి సంబంధించి కీలక ప్రకటనలో చేయనున్నట్లు అచ్చం నాయుడు. అన్ని జిల్లాల టిడిపి తమ్ముళ్లు & జన సైనికులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:
No comments:
Post a Comment