చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు
టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment