చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్
చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment