మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Follow this link:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp



Share:

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


Follow 


Share:

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp


చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.


Follow 

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

చిలకలూరిపేట :- నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ నందు ఆయన తన ఆవేదనను వెలగక్కారు. 2019 నుండి పార్టీకి కొమ్ము కాసి పనిచేస్తున్న వైసిపి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తున్నారని.. నాడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానంటే తాము అందరం కష్టపడి పని చేశామని. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి రజిని వల్ల మర్రి రాజశేఖర్ కు మొండి చేయి మిగిలిందని. కార్యకర్తలందరం వరుసలు పెట్టి పిలుచుకునేంత సన్నిహితంగా ఉంటామని కానీ ఈరోజు ఎక్కడో గుంటూరు విజయవాడ నుండి వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలబెడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. పార్టీ నాకు కాకపోయినా చిలకలూరిపేటలో ఉండే బలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే తాము అందరం కలిసి గెలిచి చూపిస్తామని ఆయన తెలిపారు. మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే తన తరఫునుంచి 20 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెడతానని ఆయన తెలియజేశారు. కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు నుండి దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు. తనకు రజిని వద్ద నుండి 6 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి తో మాట్లాడితే డబ్బులు ఇస్తుందో ఇవ్వదో వదిలేసేయ్ అని అన్నారని వాపోయారు.

Follow

Share:

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు కారణం ఇదేనా ?


మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్‌ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.

భార్య కళ్లెదుటే దారుణం..

జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్‌ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.

అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.

హతుడి పక్కనే కూర్చొని..

మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

వివాదరహితుడు

మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల. గతంలో ఈశ్వర్ కాలేజీ నందు ప్రిన్సిపల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం ఈశ్వర్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే ప్రస్తుతానికి జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం నాడు అనంతపురం జేఎన్టీయూ ముఖ ద్వారం వద్ద కాలేజీకి సంబంధించిన విద్యార్థులే బ్లేడుతో గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్ డెడ్ బాడీని చూసి సమీపంలోనే ఉన్న వారంతా షాక్ కు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కింది లింకుపై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట :- డైక్మెన్ కాలనీకి చెందిన భవాని అనే బాలుడు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మార్టూరు సీతయ్య కుమారుడు భవాని (11) వేద స్కూల్ నందు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి సమీపము నందు కరెంట్ ఆఫీస్ రోడ్డు లో నిర్మాణంలో ఉన్న ఇంటి డాబాపై ఆడుకుంటుండగా పక్కనే ఉన్న కరెంటు లైన్ వైర్లు తగిలి విద్యుత్ ఖాతానికి గురయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడ్డ భవానీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తెల్లవారుజామున మృతి మృతి చెందాడు. ఈ ఘటనతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారులు కరెంటు వైర్లకు ప్లాస్టిక్ పైపులు వేసి తగిన చర్యలు తీసుకుంటే నిండు ప్రాణం బలి అయ్యి ఉండేది కాదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.


Follow this link to join my WhatsApp group:



Share:

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?


పల్నాడు జిల్లా :-  గడిచిన మహాశివరాత్రి రోజున లక్షలాదిమంది భక్తులు కోటప్పకొండకు చేరుకొని ఆ త్రికోటేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండి భక్తులు మూలవిరాట్ దర్శనానికై కిలోమీటర్ల మేర బారులు తిరిగి దర్శనం చేసుకున్నారు. అలాగే కోటప్పకొండకు కాలినడకన వెళ్లిన భక్తులకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రతిదీ. చాలామంది భక్తులు జనసంద్రోహాన్ని దాటుకొని ఆ దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోలేని వారు కూడా ఉన్నారు. అయినా కూడా శివరాత్రి రోజున 1కోటి 63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని శనివారం నాడు లెక్కించినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల ద్వారా 3,592,950రూ||, పూజా సామాగ్రి అమ్మడం ద్వారా 5,499,638 రూ||, మిగిలిన 7,255,639రూ|| హూండీల ద్వారా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g


Share:

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?


చిలకలూరిపేట :- ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకొక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీలలో ముఖ్య నేతలు తమకు సీటు దక్కపోవటంతో మరో పార్టీలోకి జంపింగ్లు జరిగిపోయాయి. మరికొందరు టిడిపి - జనసేన - బిజెపి పొత్తు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో టికెట్ దక్కకపోతే బిజెపి  పోటీ చేసి గెలవాలని ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పొత్తు ఉంటుందని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఫిక్సయినట్లు టిడిపి ముఖ్య నేతలకు సమాచారం అందించారు దానితోపాటు ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నట్లు టిడిపి నేతలకు చంద్రబాబు తెలియజేశారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో జరగబోయే అతిపెద్ద భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బిజెపి జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీక్రెట్ కేటాయించినట్లు. టిడిపికి 145 ఎమ్మెల్యే, 17 ఎంపీ పోత్తులో భాగంగా టిడిపికి దక్కినట్లు తెలుస్తుంది.
Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం


చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు నేషనల్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే భద్రాచలానికి చెందిన ఒక క్యాటరింగ్ బృందం కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఎడ్లపాడు సమీపంలో నేషనల్ హైవే డివైడర్ కు తగిలి బొలెరో బోల్తా పడింది. దీంతో వాహనం వెనుక తలుపులు తెరుచుకొని వాహనంలో ప్రయాణిస్తున్న బుజ్జి అనే మహిళ రోడ్డు మీద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ముగ్గురు(తులసి, లక్ష్మి, చిన్నమ్మాయి) మహిళలు పాటుగా ఉన్న డ్రైవరు, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణం వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం



Share:

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

 కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

పల్నాడు జిల్లా :- 2024 కోటప్పకొండ తిరునాళ్ల కోలాహలం రంగ రంగ వైభవంగా జరిగింది. తిరుణాల ముగించుకొని వస్తున్న సమయంలో ఈటీ వద్ద యడవల్లికి చెందిన తెలుగు యువత ప్రభ నేలకొరిగింది. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లు ధ్వంసం అవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన వ్యక్తిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.

 అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరణాలను ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ప్రభలు నిర్వాహకులు తమ సాయశక్తుల ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని కొన్ని సమయంలో చిన్నచిన్న అపశృతులు జరగటం మామూలే అయినప్పటికీ అంత భారీ ఖర్చులతో భారీ ప్రభలను నిర్మించి ఇలాంటి అపసృతులు జరగటం నిర్వాహకులకు కలవర పెడుతుంటాయి.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ


Share:

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

చిలకలూరిపేట :- ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారానికి స్పీడును పెంచాయి. అందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం కార్యక్రమం పూర్తి చేయగా, నారా భువనేశ్వరి కూడా తన వంతు పార్టీ గెలుపుకై పనిచేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శంఖారావం, రా కదలిరా, జయహో బిసి వంటి భారీ బహిరంగ కార్యక్రమాలను నిర్వహించగా అందులో భాగంగానే ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ & జనసేన ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ సభ రాజకీయ చరిత్రలోనే మరువలేని ఘట్టంగా ఉంటుందని అచ్చం నాయుడు తెలిపారు. ఈ చిలకలూరిపేట సభ నుండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కి సంబంధించి కీలక ప్రకటనలో చేయనున్నట్లు అచ్చం నాయుడు. అన్ని జిల్లాల టిడిపి తమ్ముళ్లు & జన సైనికులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

 https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.


కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి - పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి.

ఈ సందర్భంగా  ఎస్పీ  మాట్లాడుతూ...

✓ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి  వస్తూ వుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు శ్రీ త్రికొటేశ్వర స్వామి వారిని స్వేచ్చగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహలకు వెళ్ళడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవలసిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట చిలకలూరిపేట సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి పార్కింగ్ స్థలాల గురించి క్రింద  తెలిపిన సూచనలను పాటించాలని ఎస్పీ గారు తెలిపారు


 

 నరసరావుపేట వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :- 

1. నరసరావుపేట నుండి కోటప్పకొండకు వచ్చు భక్తులు/VIPలు మొదలగు వారు, వారి వారి వాహనాలలో/RTC బస్సులలో ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా పార్కింగ్ ప్రదేశమునకు చేరుకుని, క్రమ పద్ధతిలో వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.

2. తిరుగు ప్రయాణంలో పార్కింగ్ వెనుక వైపు ఏర్పాటు చేయబడిన మట్టి రోడ్డును ఉపయోగించి కొండకావూరు మీదుగా పమిడిమర్రు రోడ్డును చేరి JNTU కాలేజీ మీదుగా కాకాని రోడ్ ను ఉపయోగించవలెను.


 సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-


3. సంతమాగులూరు నుండి వచ్చు భక్తులు లక్ష్మీపురం కాలువ రోడ్డును ఉపయోగించి మిన్నెకల్లు, గురిజేపల్లి మీదుగా UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను. మిన్నేకల్లు నుండి కోటప్పకొండ వైపు వాహనాలు  అనుమతించబడదు

4. సంతమాగులూరు నుండి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో గురుజేపల్లి మీదుగా సంతమాగులూరు చేరవలెను.


 చిలకలూరిపేట వైపు నుండి వచ్చు వాహనదారులు :-


5. చిలకలూరిపేట నుండి వచ్చు భక్తులు పురుషోత్తపట్నం, యడవల్లి, UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద ఏర్పాటు చేయబడిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించుకొనవలెను.

6. చిలకలూరిపేట నుండి వచ్చు VIPలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా  UT జంక్షన్ చేరి ఎడమవైపుకు తిరిగి క్రషర్ రోడ్ ను ఉపయోగించి VIP పార్కింగ్ లో వాహనమును ఉంచి, VIP బస్ లలోనే కొండపైకి చేరవలెను.

7. తిరుగు ప్రయాణంలో క్రషర్ రోడ్డు మీదుగా UT జంక్షన్ ను చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా చెరువు రోడ్డు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.

8. చిలకలూరిపేట నుండి వెళ్ళు ప్రభలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా UT జంక్షన్ చేరి  నిధి దారి గుండా ప్రభల స్టాండుకు చేరవలెను.

9. చిలకలూరిపేట నుండి వచ్చు ట్రాక్టర్లు పురుషోత్తపట్నం, యడవల్లి, అట్టల ఫ్యాక్టరీ రోడ్ మీదుగా  యక్కలవారిపాలెం మీదుగా ప్రభల స్టాండ్ కు చేరవలెను.

10. చిలకలూరిపేట వైపు తిరిగి వెళ్ళు భక్తులు శారద ఫార్మసీ దగ్గరలో పార్కింగ్ నుండి RTC బస్సులు, కార్లు UT జంక్షన్ చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా గోవిందాపురం, కోమటినేనివారి పాలెం మీదుగా నరసరావుపేట-చిలకలూరిపేట రోడ్డుకు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.

11. గంగన్నపాలెం, కోమటనేనివారి పాలెం నుండి వచ్చు భక్తులు గోవిందాపురం, కమ్మవారిపాలెం మీదుగా మద్దిరాల చేరి యడవల్లి, UT జంక్షన్ ల మీదుగా పార్కింగ్ ప్రదేశం చేరవలెను.

12. అవిశాయపాలెం, కేసానుపల్లి మీదుగా కోటప్పకొండకు వచ్చు భక్తులు SRKT చేరి, యలమంద గ్రామం మీదుగా కోటప్పకొండ వెళ్ళవలెను.

13. యలమంద, గురువాయపాలెం వైపు నుండి వచ్చు భక్తులు బాతింగ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జ్ ను చేరి, యాదవ సత్రంనకు వెనుక గల పార్కింగ్ ప్రదేశం నందు వాహనాలను పార్కు చేసుకొనవలెను.

14. రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి నరసరావుపేటకి వెళ్ళు వాహనాలు, చిలకలూరిపేట మేజర్ కెనాల్ మీద ఏర్పాటు చేసిన రూట్ లో మాత్రమే వెళ్లి AM Reddy కాలేజి వద్ద నరసరావుపేట బైపాస్ కు వెళ్లవలయును. గురవాయపాలెం, యల్లమంద మీదుగా నరసరావుపేట వైపుకు వెళ్ళుటకు ఎటువంటి వాహనములు అనుమంతించబడవు.

15. నరసరావుపేట టౌస్ నుండి కోటప్పకొండ కి వచ్చే ప్రభలు ఉదయం 10.00 గంటలకు బయలదేరి వయా యల్లమంద, గురవాయపాలెం గ్రామాల మీదుగా సాయంత్రం 4.00 గంటలకి ప్రభల నిధి వద్దకి చేరుకోనవలయును. తరువాత అనుమతించబడవు.

16. రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి రాత్రి 1.00 AM తరువాత తిరిగి వెళ్ళే వాహనాలు ఐరన్ బ్రిడ్జి మీదుగా  గోనేపూడి, కేసానుపల్లి మీదుగా నరసరావుపేట వైపుకు గాని చిలకలూరిపేట వైపుకు గాని వెళ్ళ వచ్చును.

17. AM రెడ్డి కాలేజ్ జంక్షన్ నుండి వాహనాలు బైకులు కాలుకట్ట పైకి అనుమతి లేదు.

18. కొండపైకి నడిచి వెళ్ళు భక్తులు మెట్ల దారిలో మాత్రమె నడచి వెళ్ళ వలయును. ఘాట్ రోడ్ లో భక్తులు కాలి నడకన వెళ్ళుటకు ఎలాంటి అనుమతులు లేవు. 

19. కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగు చేసుకొనుటకు పల్నాడు జిల్లా పోలీసు వారిచే ఏర్పాటు చేసిన “Kotappakonda Parking” అనే App ను Google Play store నుండి Download చేసుకుని App Home page లో కనపడుతున్న బైక్, ఆటో, కార్, ట్రాక్టర్ గుర్తులపైన తాకగా మీకు దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలాలను సూచిస్తుంది. వాటిల్లో మీకు అందుబాటులో ఉన్న పార్కింగు ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.    


 భక్తులకి పోలీసు వారి ముఖ్య గమనిక

1. మీ విలువైన వస్తువులు అనగా సెల్ ఫోన్లు, బంగారం మరియు డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి.

2. మీ వాహనాలను మీకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోగలరు. రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపరాదు.

3. చిన్నపిల్లలని మీ వెంట జాగ్రత్తగా తప్పిపోకుండా చూసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరైనా పిల్లలు గానీ, పెద్దలుగానీ తప్పిపోయిన యెడల కంట్రొల్ రూమ్ నందు సంప్రదించగలరు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.