మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.చౌత్రా సెంటర్లోని శివాలయం పాటిమీద పెద్ద శివాలయాల్లో శివనామస్మరణతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం రోజున భక్తులు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన పూర్తిచేసుకొని అనంతరం దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలలో పాల్గొని ఉపవాస దీక్ష చేపడతారు.


వీడియో మీకోసం 






Share:

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం  బోయపాలెం నందు రంగనాయక నూలుమిల్లులో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన గిరిదారిదాస్ (27) నూలు మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనితో పాటు మిల్లు క్వార్టర్స్ లోనే అతని కుటుంబ సభ్యులు ఐదుగురు కలిసి ఉంటున్నారు. రోజులాగే శనివారం రాత్రి గదిలో నిద్రపోయాడు. ఆదివారం ఉదయం అతడు మేల్కొనకపోవటంతో కుటుంబ సభ్యులు అతను చనిపోయినట్లు గుర్తించారు. అయితే అతని మృతిపై అతని పెద్దమ్మ ఫిర్యాదు మేరకు మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణం పోస్టుమార్టంలో తేలాల్సిఉంది.  యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Share:

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సిందే కానీ న్యూజిలాండ్ గెలవడంతో రేపు జరగబోయే నమీబియా మ్యాచ్ లో భారత్ గెలిచినా సెమిస్ కి వెళ్లదు. పొద్దున నుండి భారత క్రికెట్ ప్రేమికులు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఆకాంక్షించారు. కానీ న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఇంటి బాట పట్టింది.

ఇప్పటికే ఐపీఎల్ బెంగళూరు టీంకు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ - అంతర్జాతీయ టి20 కెప్టెన్సీకి వైదొలుగుతున్నట్లు గతంలో పర్యటించాడు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీకి చివరి మ్యాచ్. T20 ఫార్మెట్లో లో కింగ్ మొత్తం 49 మ్యాచ్లకు సారథ్యం వహించగా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుపొందలేదు. అందులో 29 సార్లు గెలవగా 16 సార్లు ఓడిపోయింది టీమిండియా.




Share:

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


మాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది -  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డంపెట్టుకొని పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు కలుగజేసి, ఆరు రోజులు గుంటూరు జిల్లాలో తండోపతండాలుగా ప్రజలు రావటం చూసి మహాపాదయాత్ర ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక జగన్ మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపుతున్నారు. ఆ రైతులు కన్నీరు పెట్టి దగ్గర బాగుపడ్డటు చరిత్రలో లేదు. అమరావతి రైతులు పాదయాత్ర అడ్డుకోవాలనే పన్నాగం పన్నాడు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 35 వేల ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుందామని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మి అమరావతి రైతులు ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటమార్చి రైతులను బాధలకు గురి చేసి, వారు చేస్తున్న దీక్షలు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకోకుండా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహరించటం చాలా దుర్మార్గమైన చర్య. హైకోర్టు అమరావతి రైతులు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గ్రహించాలి. ఇది ఒక అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు అండగా ఉండాలి. అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై  విరుచుకుపడ్డారు.గతంలో ప్రభుత్వాలు పేదలకు 1983 నుంచి గృహాలు & స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఆ స్థలాల మీద 10 వేల నుంచి 15 వేల రూపాయల కట్టమని పేద ప్రజలను భయభ్రాంతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాలంటరీ వారు డబ్బులు కట్టాల్సిందే కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అని ప్రజల్ని ఎప్పుడూ ఇచ్చిన గృహాలు స్థలాల మీద ఇలా టాక్స్ వెయ్యటం ఎంతో ఘోరమైన చర్య జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం దారుణం‌ అని, కట్టిన గృహాలు సాక్షాత్తు చిలకలూరిపేట 52 ఎకరాలలో 4600 గృహాలు నిర్మాణం పూర్తయి ఉంటే ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. పాడుబడ్డ విధంగా ఆ గ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో రావడంతో అన్ని రుణమాఫీ, గృహాలకు రూపాయి కట్టే పని  లేకుండా చేస్తామని చెప్పి, పేద ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. పేద ప్రజల ఏమో అప్పోసప్పో చేసి యాభై రెండు ఎకరాల గృహాల కోసం డబ్బులు కొంత డబ్బులు కట్టారు. ఆ డబ్బులు వడ్డీలు కట్టలేక ఈ గృహాలు రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా వాలంటరీ వారిచేత పేద ప్రజల దగ్గర డబ్బులు ముక్కుపిండి వసూలు చెయ్యటం ఎంత  దుర్మార్గమైన చర్య. ఈ చర్య కు తెర లెపేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం ఎంత దారుణమైన చర్య, అంటూ తక్షణమే పేదలకు న్యాయం జరిగేలా ఉండాలి. వారి గృహాల వారికి అందించాలి. డబ్బులు వసూలు చేయటం తక్షణమే ఆపివేయాలి. అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి పై  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.




Share:

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

CM జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని హీరో షోరూం ఎదురుగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.



Share:

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .

ర్యాలీలో పాల్గొన్న మాజీ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రాజధాని రైతుల బాధలను తెలుసుకొని పునరాలోచన చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. ర్యాలీగా వెళ్లి పెదనందిపాడు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ, సిపిఐ నాయకురాలు నాగభైరు సుబ్బాయమ్మ, ప్రజా సంఘాల నేతలు, అమరావతి మద్దతుదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



Share:

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టిడిపి నుండి గెలిచి YSRCP కండువా తప్పుకున్న విషయం అందరికీ తెలిసినదే. గుంటూరు మేయర్ పదవి ప్రకటించే ముందు రెండున్నర సంవత్సరం కావటి మనోహర్ నాయుడు మరో రెండున్నర సంవత్సరం పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కేటాయిస్తున్నట్లు అప్పట్లో గుంటూరు YSRCP తెలిపింది. అయితే పాదర్తి రమేష్ గాంధీ గుండెపోటుతో మరణించడం తో ఆరో వార్డు జరగవలసిన ఉప ఎన్నికలకు టిడిపి నుండి వైసిపికి వచ్చిన మద్దాలి గిరి పెత్తనం చేస్తున్నారంటూ స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త గుజ్జుల రామకృష్ణారెడ్డి మద్దాలి గిరి విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారు. ఆరవ వార్డు స్థానికులకు కాకుండా మద్దాల గిరి సొంత ఊరైన రెంటచింతల నుండి వ్యక్తిని తీసుకొనివచ్చి అభ్యర్థిగా ప్రకటించడం తో ఈ వివాదం చెలరేగింది. సదరు వ్యక్తి గుట్కా సప్లై చేస్తూ అక్రమంగా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు అని, స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఎలా అభ్యర్థి గా పర్యటిస్తారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నుండి Ysrcp కండువా కప్పుకున్నారు అని, దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం మద్దాలి గిరి నాలుగు కోట్లు డిమాండ్ చేశారని ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు నగర వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.




Share:

6 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు

6  ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తడబడింది. 17.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 85 స్కోర్ చేసింది. తరువాత దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్ శర్మ 16 బంతులకు 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 18 బంతులకు 50 పరుగులు చేశాడు. చివరలో వచ్చిన  సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించారు. 6.3 ఓవర్లకు భారత్ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆదివారం జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, భారత్ & నమీబియా మధ్య జరగబోయే మ్యాచ్ భారత్ గెలిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో ఏది తడబడినా టీమిండియా ఇంటి బాట పట్టాల్సిందే.



Share:

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ మొత్తం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతిలో వేల ఎకరాల భూములు దానం చేసిన రైతులు ఖంగు తిన్నారు. నాటి నుండి మొదలుకొని ఇప్పటికీ దీక్షలు చేస్తున్న - రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేస్తున్నారంటూ రైతులు చేసే దీక్షను పక్కదోవ పట్టిస్తున్నారని, న్యాయపోరాటానికి "న్యాయస్థానం టు దేవస్థానం" అనే నినాదంతో అమరావతి రైతులు పాదయాత్ర  మొదలుపెట్టారు. అందులో భాగంగా రేపు అనగా 6/11/2021 శనివారం నాడు పెదనందిపాడు చేరుకోనున్నారు. రేపు ఉదయం మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ గా పెదనందిపాడు తరలిరావాలని - నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మరియు అమరావతి రైతుల మద్దతుదారులు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి - 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రైతులు గళాన్ని వినిపించాలి అని చిలకలూరిపేట టిడిపి పిలుపునిచ్చింది. నియోజకవర్గం పరిధిలోని వార్డు, మండల, జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు-

 ఇట్లు 

తెలుగుదేశం పార్టీ 

చిలకలూరిపేట నియోజకవర్గం.





Share:

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.

ఇవి చేస్తే మంచిది:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఇవి చేయరాదు:

తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.





Share:

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి నుండి చిలకలూరిపేట వచ్చే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీ కొడుకులకు గాయాలు.

వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన కరిముల్లా అతని కొడుకు ఖదీర్ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలుకై చిలకలూరిపేట కు బయల్దేరారు. మార్గమధ్యలో చిలకలూరిపేట నుండి వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కిందపడిపోయారు. ఢీకొన్న ద్విచక్ర వాహనం ఆపకుండా బొప్పూడి వైపు వెళ్లిపోయారు. వెనక వచ్చే వాహనదారుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పరిశీలించారు. తండ్రి కరీముల్లా కు ఎడమ కాలు కి స్వల్ప గాయం, కుమారుడు ఖదీర్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయింది. వెంటనే అంబులెన్స్ సిబ్బంది చిలకలూరిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

Share:

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాట్ తగ్గించారు. కర్ణాటక, గోవా, మణిపూర్, యానం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలలో 7 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాయి దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 12 రూపాయలు డీజిల్ పై 17 రూపాయల భారం తగ్గింది.

ఇదిలా ఉంటే ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయి ఏమో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ సర్కార్ పెట్రోల్ పై 31 రూపాయలు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పెట్రోల్ పై 26 రూపాయల vat వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లు ఇంధన ధరల పై వ్యాట్ తగ్గిస్తే వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.



Share:

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

దీపావళి అంటేనే బాణాసంచా, దీపాల అలంకరణ, పూజా కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా టపాసు లేకుండా దీపావళి జరుపుకోవాలంటే అది పండుగలాగే ఉండదు. అయితే గత సంవత్సరం కోవిడ్ కారణంగా దీపావళి బాణాసంచా విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి లాక్ డౌన్ లేకపోవడంతో బాణాసంచా కాల్చటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నిప్పు లేకుండానే టపాసులు పేలుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే నిప్పు లేకుండా టపాసులు ఎలా పేలుతుంది అనుకుంటున్నారా !

టపాసులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు ఈ మాటే అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం బాణసంచా డబల్ రేట్ ఉండటంతో సామాన్యులు టపాసులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఒక సామాన్యుడు దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 7 సమయంలో కుటుంబంతో పాటు బాణాసంచా కాల్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం బాణాసంచా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 1000 & 1500 రూపాయలకు మనకు కావాల్సిన చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇతర టపాసులు లాంటివి తెచ్చుకొని మూడు రోజులపాటు సాయంత్రం సమయాల్లో వాటిని కాలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం తక్కువలో తక్కువ గా 4000 నుండి 5000 రూపాయల వరకు వెచ్చించవలసిన వస్తుంది. అమ్మకందారులు ట్రాన్స్పోర్టేషన్, పెరిగిన ఇంధన ధరలు వలన ఈ రేట్లు తప్పవని చెబుతున్నారు. ఏది ఏమైనా టపాసు లేని దీపావళి ఊహించుకోలేము కదా! 




Share:

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

*MLA విడదల రజిని :- 

దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు :-

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలి. తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాక్షసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, టపాసులు కాల్చిన తర్వాత చేతులు కడుక్కోవటానికి సబ్బును ఉపయోగించoడి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్:-

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి కుటుంబాలలో వెలుగు నింపాలని ఆయన కోరారు.

టౌన్ సిఐ రాజేశ్వరరావు:- 

పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా, చిన్నపిల్లల దూరంగా ఉంచుతూ సంబరాలు చేసుకోవాలి. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలి.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.