ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?
దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాట్ తగ్గించారు. కర్ణాటక, గోవా, మణిపూర్, యానం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలలో 7 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాయి దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 12 రూపాయలు డీజిల్ పై 17 రూపాయల భారం తగ్గింది.
ఇదిలా ఉంటే ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయి ఏమో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ సర్కార్ పెట్రోల్ పై 31 రూపాయలు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పెట్రోల్ పై 26 రూపాయల vat వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లు ఇంధన ధరల పై వ్యాట్ తగ్గిస్తే వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
No comments:
Post a Comment