చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్
చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి నుండి చిలకలూరిపేట వచ్చే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీ కొడుకులకు గాయాలు.
వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన కరిముల్లా అతని కొడుకు ఖదీర్ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలుకై చిలకలూరిపేట కు బయల్దేరారు. మార్గమధ్యలో చిలకలూరిపేట నుండి వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కిందపడిపోయారు. ఢీకొన్న ద్విచక్ర వాహనం ఆపకుండా బొప్పూడి వైపు వెళ్లిపోయారు. వెనక వచ్చే వాహనదారుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పరిశీలించారు. తండ్రి కరీముల్లా కు ఎడమ కాలు కి స్వల్ప గాయం, కుమారుడు ఖదీర్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయింది. వెంటనే అంబులెన్స్ సిబ్బంది చిలకలూరిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
No comments:
Post a Comment