మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


మాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది -  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డంపెట్టుకొని పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు కలుగజేసి, ఆరు రోజులు గుంటూరు జిల్లాలో తండోపతండాలుగా ప్రజలు రావటం చూసి మహాపాదయాత్ర ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక జగన్ మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపుతున్నారు. ఆ రైతులు కన్నీరు పెట్టి దగ్గర బాగుపడ్డటు చరిత్రలో లేదు. అమరావతి రైతులు పాదయాత్ర అడ్డుకోవాలనే పన్నాగం పన్నాడు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 35 వేల ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుందామని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మి అమరావతి రైతులు ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటమార్చి రైతులను బాధలకు గురి చేసి, వారు చేస్తున్న దీక్షలు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకోకుండా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహరించటం చాలా దుర్మార్గమైన చర్య. హైకోర్టు అమరావతి రైతులు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గ్రహించాలి. ఇది ఒక అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు అండగా ఉండాలి. అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై  విరుచుకుపడ్డారు.గతంలో ప్రభుత్వాలు పేదలకు 1983 నుంచి గృహాలు & స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఆ స్థలాల మీద 10 వేల నుంచి 15 వేల రూపాయల కట్టమని పేద ప్రజలను భయభ్రాంతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాలంటరీ వారు డబ్బులు కట్టాల్సిందే కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అని ప్రజల్ని ఎప్పుడూ ఇచ్చిన గృహాలు స్థలాల మీద ఇలా టాక్స్ వెయ్యటం ఎంతో ఘోరమైన చర్య జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం దారుణం‌ అని, కట్టిన గృహాలు సాక్షాత్తు చిలకలూరిపేట 52 ఎకరాలలో 4600 గృహాలు నిర్మాణం పూర్తయి ఉంటే ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. పాడుబడ్డ విధంగా ఆ గ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో రావడంతో అన్ని రుణమాఫీ, గృహాలకు రూపాయి కట్టే పని  లేకుండా చేస్తామని చెప్పి, పేద ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. పేద ప్రజల ఏమో అప్పోసప్పో చేసి యాభై రెండు ఎకరాల గృహాల కోసం డబ్బులు కొంత డబ్బులు కట్టారు. ఆ డబ్బులు వడ్డీలు కట్టలేక ఈ గృహాలు రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా వాలంటరీ వారిచేత పేద ప్రజల దగ్గర డబ్బులు ముక్కుపిండి వసూలు చెయ్యటం ఎంత  దుర్మార్గమైన చర్య. ఈ చర్య కు తెర లెపేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం ఎంత దారుణమైన చర్య, అంటూ తక్షణమే పేదలకు న్యాయం జరిగేలా ఉండాలి. వారి గృహాల వారికి అందించాలి. డబ్బులు వసూలు చేయటం తక్షణమే ఆపివేయాలి. అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి పై  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.




Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.