భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సిందే కానీ న్యూజిలాండ్ గెలవడంతో రేపు జరగబోయే నమీబియా మ్యాచ్ లో భారత్ గెలిచినా సెమిస్ కి వెళ్లదు. పొద్దున నుండి భారత క్రికెట్ ప్రేమికులు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఆకాంక్షించారు. కానీ న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఇంటి బాట పట్టింది.
ఇప్పటికే ఐపీఎల్ బెంగళూరు టీంకు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ - అంతర్జాతీయ టి20 కెప్టెన్సీకి వైదొలుగుతున్నట్లు గతంలో పర్యటించాడు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీకి చివరి మ్యాచ్. T20 ఫార్మెట్లో లో కింగ్ మొత్తం 49 మ్యాచ్లకు సారథ్యం వహించగా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుపొందలేదు. అందులో 29 సార్లు గెలవగా 16 సార్లు ఓడిపోయింది టీమిండియా.
No comments:
Post a Comment