చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం నందు రంగనాయక నూలుమిల్లులో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన గిరిదారిదాస్ (27) నూలు మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనితో పాటు మిల్లు క్వార్టర్స్ లోనే అతని కుటుంబ సభ్యులు ఐదుగురు కలిసి ఉంటున్నారు. రోజులాగే శనివారం రాత్రి గదిలో నిద్రపోయాడు. ఆదివారం ఉదయం అతడు మేల్కొనకపోవటంతో కుటుంబ సభ్యులు అతను చనిపోయినట్లు గుర్తించారు. అయితే అతని మృతిపై అతని పెద్దమ్మ ఫిర్యాదు మేరకు మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణం పోస్టుమార్టంలో తేలాల్సిఉంది. యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment