మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

 చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

గుంటూరు - చిలకలూరిపేట నేషనల్ హైవే మధ్యలో ఆటో ప్రైవేటు బస్సుని ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తితో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఈనాడు ఆఫీస్ సమీపంలో రాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడ నుండి కడప వెళ్తున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సును ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఆటోని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి బస్సును ఢీకొన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తులు మధ్య మధ్యలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆటోలోని వ్యక్తులు కోండ్రుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన అనంతరం రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో హుటాహుటిన ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.

Follow below

Share:

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?


34 మందితో టిడిపి రెండో జాబితాను విడుదల చేసింది.

నరసన్నపేట తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి

గాజువాక తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు

చోడవరం తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్‌.ఎస్‌. రాజు

మాడుగుల తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్‌

ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ

రామచంద్రపురం తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్‌

రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష

కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు

దెందులూరు తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు తెదేపా అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌

గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ

గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థిగా మహ్మద్‌ నజీర్‌

గురజాల తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు

కందకూరు తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి

గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్‌ రెడ్డి

ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి

కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

వెంకటగిరి తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ

కమలాపురం తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి

ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి

నందికొట్కూరు తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య

కదిరి - కందికుంట యశోదా దేవి

పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి

మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి

ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి

పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్‌

సత్యవేడు - కోనేటి ఆదిమూలం 

శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి

చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్‌

పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి 

మదనపల్లి - షాజహాన్‌ బాషా

పల్నాడులో నరసరావుపేట అభ్యర్థిని తప్ప మిగతా అభ్యర్థులందరిని ప్రకటించిన టిడిపి. ఇప్పటికే అరవింద బాబు పై పలు ‌సర్వేలు నిర్వహించినప్పటికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్ బిజెపికి అప్పగించిన సంగతి తెలిసిందే. మళ్లీ 2024 లో రిపీట్ అవుతుందేమో చూడాలి.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్


చిలకలూరిపేట :- టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో 17వ తారీకు అనగా ఆదివారం నాడు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి పనులని చకచగా కార్యరూపం దాల్చడంతో సభ నిర్వహించేందుకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు, బిజెపి పార్టీ నుండి నాగభూషణం, జనసేన పార్టీ నుండి గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ చిలకలూరిపేట తోట రాజా రమేష్ మరియు టిడిపి, జనసేన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సభ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి ఉమ్మడి మేనిఫెస్టో సభ నభూతో నభవిష్యతీ అన్నట్టుగా ఉంటుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యమైందని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రాభివృద్ధికి కొత్తబాటలు వేస్తాయన్నారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కలవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సభకు బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో లోకేష్‌ ప్రత్యేకంగా భేటీ అయి ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భాజపాతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు సుమారు 15లక్షల మంది జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. పైగా ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సభ చిలకలూరిపేట కావటంతో ప్రత్తిపాటి పుల్లారావుపై బాధ్యతలు పెరిగాయని లోకేష్‌ వ్యాఖ్యానించారు. లోకేష్‌తో భేటీ తర్వాత పుల్లారావు మీడియాలో మాట్లాడుతూ 17న జరిగే సభతోనే జగన్‌ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుందని, తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌లో 175 నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని వెల్లడించారు. లక్షలాది మందితో జరిగే ఈ సభ దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. దేశానికి మోదీ ఒక దశ దిశ అయితే.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దశ దిశ అన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా దేశానికి ఒక సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజలను కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషం, ఆడబిడ్డలు క్షేమం, యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ బహిరంగ సభ దిక్సూచిలా ఉంటుందని తెలిపారు.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు టిడిపి పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేట పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట ysrcp అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో పట్టణంలోని వైసీపీ శ్రేణులు స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికేతులలోకి టికెట్ ఇవ్వటంపై నిరసనగా ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీస్ వారు కార్యకర్తలను అడ్డుకోవడంతో వారి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఒకానొక సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి లాఠీచార్జ్ జరిగే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసు వారు సమయం పాటించి పరిస్థితిని అదుపులోకి తీసుకొని. చిలకలూరిపేట లో ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం మంత్రి విడుదల రజిని అని కార్యకర్తలు వాపోతున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వటం వలన పార్టీ పట్టును కోల్పోతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ విడదల రజిని అంటూ పట్టణ వీధుల్లో వైసిపి కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తులకు అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి రజిని ఉన్నారని కార్యకర్తలు తెలియజేశారు.

Follow 


Share:

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Follow this link:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp



Share:

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


Follow 


Share:

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp


చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.


Follow 

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

చిలకలూరిపేట :- నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ నందు ఆయన తన ఆవేదనను వెలగక్కారు. 2019 నుండి పార్టీకి కొమ్ము కాసి పనిచేస్తున్న వైసిపి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తున్నారని.. నాడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానంటే తాము అందరం కష్టపడి పని చేశామని. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి రజిని వల్ల మర్రి రాజశేఖర్ కు మొండి చేయి మిగిలిందని. కార్యకర్తలందరం వరుసలు పెట్టి పిలుచుకునేంత సన్నిహితంగా ఉంటామని కానీ ఈరోజు ఎక్కడో గుంటూరు విజయవాడ నుండి వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలబెడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. పార్టీ నాకు కాకపోయినా చిలకలూరిపేటలో ఉండే బలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే తాము అందరం కలిసి గెలిచి చూపిస్తామని ఆయన తెలిపారు. మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే తన తరఫునుంచి 20 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెడతానని ఆయన తెలియజేశారు. కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు నుండి దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు. తనకు రజిని వద్ద నుండి 6 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి తో మాట్లాడితే డబ్బులు ఇస్తుందో ఇవ్వదో వదిలేసేయ్ అని అన్నారని వాపోయారు.

Follow

Share:

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు కారణం ఇదేనా ?


మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్‌ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.

భార్య కళ్లెదుటే దారుణం..

జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్‌ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.

అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.

హతుడి పక్కనే కూర్చొని..

మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

వివాదరహితుడు

మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల. గతంలో ఈశ్వర్ కాలేజీ నందు ప్రిన్సిపల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం ఈశ్వర్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే ప్రస్తుతానికి జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం నాడు అనంతపురం జేఎన్టీయూ ముఖ ద్వారం వద్ద కాలేజీకి సంబంధించిన విద్యార్థులే బ్లేడుతో గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్ డెడ్ బాడీని చూసి సమీపంలోనే ఉన్న వారంతా షాక్ కు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కింది లింకుపై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట :- డైక్మెన్ కాలనీకి చెందిన భవాని అనే బాలుడు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మార్టూరు సీతయ్య కుమారుడు భవాని (11) వేద స్కూల్ నందు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి సమీపము నందు కరెంట్ ఆఫీస్ రోడ్డు లో నిర్మాణంలో ఉన్న ఇంటి డాబాపై ఆడుకుంటుండగా పక్కనే ఉన్న కరెంటు లైన్ వైర్లు తగిలి విద్యుత్ ఖాతానికి గురయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడ్డ భవానీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తెల్లవారుజామున మృతి మృతి చెందాడు. ఈ ఘటనతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారులు కరెంటు వైర్లకు ప్లాస్టిక్ పైపులు వేసి తగిన చర్యలు తీసుకుంటే నిండు ప్రాణం బలి అయ్యి ఉండేది కాదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.


Follow this link to join my WhatsApp group:



Share:

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?


పల్నాడు జిల్లా :-  గడిచిన మహాశివరాత్రి రోజున లక్షలాదిమంది భక్తులు కోటప్పకొండకు చేరుకొని ఆ త్రికోటేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండి భక్తులు మూలవిరాట్ దర్శనానికై కిలోమీటర్ల మేర బారులు తిరిగి దర్శనం చేసుకున్నారు. అలాగే కోటప్పకొండకు కాలినడకన వెళ్లిన భక్తులకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రతిదీ. చాలామంది భక్తులు జనసంద్రోహాన్ని దాటుకొని ఆ దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోలేని వారు కూడా ఉన్నారు. అయినా కూడా శివరాత్రి రోజున 1కోటి 63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని శనివారం నాడు లెక్కించినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల ద్వారా 3,592,950రూ||, పూజా సామాగ్రి అమ్మడం ద్వారా 5,499,638 రూ||, మిగిలిన 7,255,639రూ|| హూండీల ద్వారా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g


Share:

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?


చిలకలూరిపేట :- ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకొక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీలలో ముఖ్య నేతలు తమకు సీటు దక్కపోవటంతో మరో పార్టీలోకి జంపింగ్లు జరిగిపోయాయి. మరికొందరు టిడిపి - జనసేన - బిజెపి పొత్తు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో టికెట్ దక్కకపోతే బిజెపి  పోటీ చేసి గెలవాలని ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పొత్తు ఉంటుందని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఫిక్సయినట్లు టిడిపి ముఖ్య నేతలకు సమాచారం అందించారు దానితోపాటు ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నట్లు టిడిపి నేతలకు చంద్రబాబు తెలియజేశారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో జరగబోయే అతిపెద్ద భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బిజెపి జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీక్రెట్ కేటాయించినట్లు. టిడిపికి 145 ఎమ్మెల్యే, 17 ఎంపీ పోత్తులో భాగంగా టిడిపికి దక్కినట్లు తెలుస్తుంది.
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.