మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

చిలకలూరిపేట:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్రలో భాగంగా... నేడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామానికి చేరుకోనున్నారు. చంద్రబాబు అరెస్టుపై మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఎడ్లపాడు ఎస్టి కాలనీకి చెందిన మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి నేడు చిలకలూరిపేట నియోజకవర్గం చేరుకోనున్నారు.

మరిన్ని వివరాలకై క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వైసీపీ నేత జాలాది సుబ్బారావు మాట్లాడుతూ... చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజిని అండ చూసుకొని వారి మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగు పక్కన ఉన్న గొర్రెల సంత వద్ద చిలకలూరిపేట టు పసుమర్తి రోడ్డు మధ్యలో అడ్డంగా గోడ కట్టడం వలన తారు రోడ్డు సాంక్షన్ అయినా కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇంతవరకు చేపట్ట లేదంటే దానికి కారణం రోడ్డుకి మధ్యలో అడ్డంగా గోడ కట్టడం. దాని వలన రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయని, గోడను తొలగించాలంటే కోటి రూపాయలు ఇస్తే కానీ గోడను తొలగించమని విడుదల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసినట్లు జాలాది సుబ్బారావు తెలిపారు. ఈ విషయం మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించామని సరైన స్పందన లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని ఆయన తెలిపారు. పసుమర్తి టు చిలకలూరిపేట రోడ్డు వేస్తే రవాణా సౌకర్యానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్:- కేజీబీ అనగానే అదెక్కడుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు. కేజీబీ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటే కాకినాడ తీరంలోని సముద్ర జలాలలో ONGC నిర్వహించిన పరిశోధనలో మన బంగాళాఖాతంలో భారీ ఎత్తున చమురు నిల్వలు సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు 35 వేల నుంచి 45 వేల బేర్ల చమురుని మనం ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ మరియు ఆయన ద్వారా వచ్చే లాభాలలో 50% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలని. మన వాటా మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సహజ సంపద - ప్రజల హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల గురించి వివరించుతూ ... ఏ రాష్ట్రం నుంచి అయినా సహజ సంపద వలన లాభాలు వస్తాయో ఆ లాభాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 50% లాభాలను ఇవ్వాలని యాక్ట్ ఉన్నా కూడా మన రాష్ట్రానికి మన వాటా వినటం లేదని వారు తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నాయకులు వలన లాభాలను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలని నాయకులు తీర్మానించుకున్నారు. ఈ లాభాలను మనం పొందగలిగితే రాష్ట్ర అప్పుల భారం ఎంతో కొంత తీరుతుందని దీని ద్వారా వంద రూపాయలకే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేయవచ్చు అని దీని పెట్టి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు.

Share:

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

చిలకలూరిపేట :- వివిధ అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 5,05,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను రాజశేఖర్ ఆఫీస్ నందు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు,  తెలుపుతూ తమకు సహకరించిన రాజశేఖర్ గారికి రుణపడి ఉంటాము అని వారు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

 చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట :- పట్టణంలోని సుబ్బయ్య తోట మస్తాన్ వలి దర్గా వద్ద 52వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దేవరకొండ పుల్లారావుతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య తోట యూత్ మరియు సుబ్బయ్య తోట టిడిపి కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరసరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ తారా స్థాయికి చేరింది. ఏకంగా కార్యకర్తలను ఒకచోటకు చేర్చి తమ అసమతిని వెలగక్కారు. వివరాల్లోకి వెళితే నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించకూడదు అని ఆ పార్టీ నర్సరావుపేట సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి చెప్పారు. శుక్రవారం పెద్ద రెడ్డి పాలెం లో జరిగిన వైసిపి అంతర్గత సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు రాబోవు ఎన్నికలలో గోపిరెడ్డికి సహకరించవద్దని ఆయన తెలిపారు. ఇంకా అభ్యర్థి సీటు ఖరారు కాలేదని తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

 గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

ఆంధ్రప్రదేశ్ :-  కంచె చేను మేస్తుందంటే ఇదేనేమో. గంజాయి నుంచి సామాన్య ప్రజలను రక్షించాల్సింది పోయి పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ తారస్థాయికి చేరింది. పోలీసులే ఏకంగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు విమర్శకులు. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్ బాచుపల్లి SOT పోలీసులు చేసిన దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించగా నిందితులు ఏపీఎస్పీకి చెందిన కాకినాడ మూడవ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి ప్రయాణిస్తున్న కారులో ఏకంగా 22 కేజీల దొరికినట్లు సమాచారం. విధులకు సెలవులు పెట్టి మరి ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

 బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే 32 మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆమె చికిత్స పొందుతూ సొంత ఊరు అయిన కాన్పూర్లో నిన్న రాత్రి చనిపోయినట్లు వారు తెలిపారు. మాలిని అండ్ కో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మైనార్టీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్సీని నియమిస్తూనట్లు ప్రకటించిన ప్రత్తిపాటి

 చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మైనార్టీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్సీని నియమిస్తూనట్లు ప్రకటించిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మైనార్టీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్సీని నియమిస్తూనట్లు ప్రకటించిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ తమ స్ట్రాటజీలను అమలు చేయడంలో స్పీడును పెంచాయి. ఇప్పటికే అధికార వైసిపి మున్సిపల్ చైర్మన్ గా మైనారిటీ వ్యక్తిని, రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఎస్సీలను నియమించింది. అయితే తాజాగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు  ఆధ్వర్యంలో చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా పఠాన్ సమద్ ఖాన్( మైనారిటీ) మరియు పట్టణ ప్రధాన కార్యదర్శిగా మద్దుమాల రవిని( SC) నియమిస్తున్నట్లు ప్రతిపాటి పుల్లారావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ జెండా విజయకేతనం ఎగరవేయాలని అభిమానులకు దిశా నిర్దేశం చేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ ఉంటుందని ఆమె తెలిపారు. బడ్జెట్ 46.6 లక్షల కోట్లు ఉండగా ఆదాయం 30.80 కోట్లు గా ఆమె తెలిపారు.

* ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది.

* ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది.

* పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి.

* ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది.

* పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు.

* వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

* 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు.

* రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్‌ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

* అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.

* స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లక్షపతి దీదీ'లుగా మారేందుకు సాధికారత.

* ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు.

* స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్‌లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి.

* పరిశోధన, సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం.

* మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం.

* 40వేల నార్మల్‌ బోగీలను వందేభారత్‌ ప్రమాణాలకు పెంచుతాం.

* యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం.

* 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం.

* లక్ష కోట్లతో ప్రైవేట్‌ సెక్టార్‌కి కార్పస్‌ ఫండ్‌.

* టూరిస్ట్‌ హబ్‌గా లక్షద్వీప్‌.

* 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు.

* 3 మేజర్‌ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం.

* వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం.

* 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

* ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి.

* దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు.

* రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

* 80 కోట్ల మందికి ఫ్రీరేషన్‌తో ఆహార సమస్య తీర్చాం.

* మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం.

* వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం.

* ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.

* GDP అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్‌ఫార్మెన్స్‌.

* మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం.

* 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు.

* 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం.

* స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు.

* 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు.

* 11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం.

* 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం.

* జన్‌ధన్‌ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం.

* స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.

* లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు.

* 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం.

* నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం.

* అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌.

* దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు.


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - గంజాయి తరలిస్తున్న యువకులకు రోడ్డు ప్రమాదం - కట్ చేస్తే ...... జైలుకి

 చిలకలూరిపేట - గంజాయి తరలిస్తున్న యువకులకు రోడ్డు ప్రమాదం - కట్ చేస్తే ...... జైలుకి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గం :- యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు గంజాయి తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే శివ కుమార్, శంకర్ అనే ఇద్దరు యువకులు ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా యడ్లపాడు వద్ద లారీలు చెక్ చేయడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అది గమనించిన యువకులు తమ ద్విచక్ర వాహనాలను దిశ మార్చి హడావిడిగా పారిపోవడానికి ప్రయత్నించి కింద పడ్డారు. ఇది గమనించిన పోలీసులు వారి బ్యాగులను చెక్ చేయగా అందులో 11 లక్షల విలువైన 107 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే వారికి ప్రథమ చికిత్స అందించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనలో వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను మరియు 107 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా చిలకలూరిపేట రూరల్ సిఐ పి శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల ఎస్సై బలరాం రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరో మూడు ద్విచక్ర వాహనాలు ద్వారా విజయవాడ మీద నుంచి హైదరాబాద్కి తరలించినట్లు వీరు ఇరువురి మాత్రం దారి తప్పటంవలన తమకు చిక్కారని వారిని కోర్టు ముందు పెడుతున్నట్లు, మిగిలిన ముగ్గురుని కూడా త్వరలోనే పట్టుకుంటామని వారు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింద లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.