గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు
ఆంధ్రప్రదేశ్ :- కంచె చేను మేస్తుందంటే ఇదేనేమో. గంజాయి నుంచి సామాన్య ప్రజలను రక్షించాల్సింది పోయి పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ తారస్థాయికి చేరింది. పోలీసులే ఏకంగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు విమర్శకులు. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్ బాచుపల్లి SOT పోలీసులు చేసిన దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించగా నిందితులు ఏపీఎస్పీకి చెందిన కాకినాడ మూడవ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి ప్రయాణిస్తున్న కారులో ఏకంగా 22 కేజీల దొరికినట్లు సమాచారం. విధులకు సెలవులు పెట్టి మరి ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
No comments:
Post a Comment