కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం
కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం
వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు
వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు
1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ
2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు
3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్
4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు
6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్
9 రాజాం - శ్రీ తలే రాజేష్
10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి
11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల
12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు
13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర
14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం - శ్రీ బొత్స అప్పలనరసయ్య
17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు
18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల
19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు
20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు
21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ
22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్
23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు
24 విశాఖపట్నం పశ్చిమం -
25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్
26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ
27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు
28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం
29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు
30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్
31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్
32 ఎలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు
34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్
35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా
36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ వరుపుల సుబ్బారావు
37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత
38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు
39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు
40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42 రామచంద్రపురం- శ్రీ పిల్లి సూర్యప్రకాష్
43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్
44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్
45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు
46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్
47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట - శ్రీ వి.జోగేశ్వరరావు
49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్
51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా
52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం
53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి
54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్
55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు
56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు
58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు
59 భీమవరం - శ్రీ గ్రంధి శ్రీనివాస్
60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు
61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ
63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు
64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి
65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
66 గోపాలపురం - శ్రీ తలారి వెంకట్రావు
67 పోలవరం - శ్రీ తెల్లం బాలరాజు
68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా
69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి
70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ
72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు
74 పెడన - శ్రీ ఉప్పల రాము
75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి
76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి
77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే
78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్
79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్
80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్
81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్
82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు
83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు
84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని
85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు
86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత
87 మంగళగిరి - శ్రీమతి కాండ్రు కమల
88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా
89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు
90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్
91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్
92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి
93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్
94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని
95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా
96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు
97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు
99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు
100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి
101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్
103 దర్శి - శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్
104 పర్చూరు - శ్రీ యడం బాలాజీ
105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి
106 చీరాల - శ్రీ ఆమంచి కృష్ణా మోహన్
107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున
108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి
109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్
110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్
111 మార్కాపురం - శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి
112 గిద్దలూరు - శ్రీ అన్నా రాంబాబు
113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్
114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి
116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్
118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి
120 గూడూరు - శ్రీ మేరిగ మురళి
121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ
125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా
127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి
130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి
134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి
135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా
137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్
138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి
141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్
142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి
143 కోడుమూరు - శ్రీ డా. సతీష్
144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక
145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి
146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి
147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి
148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి
149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి
150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి
151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి
152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు
153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి
154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య
155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప
157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక
158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్
159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్
162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి
163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి
164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్
165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి
168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి
169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్
170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా
171 గంగాధర నెల్లూరు - శ్రీ ఎం రెడ్డెప్ప
172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి
173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్
174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ
175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్
చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?
34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?
34 మందితో టిడిపి రెండో జాబితాను విడుదల చేసింది.
నరసన్నపేట తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి
గాజువాక తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు
చోడవరం తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్.ఎస్. రాజు
మాడుగుల తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్
ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ
రామచంద్రపురం తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష
కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్
గోపాలపురం తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు తెదేపా అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ
గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థిగా మహ్మద్ నజీర్
గురజాల తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు
కందకూరు తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్ రెడ్డి
ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి
కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ
కమలాపురం తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి
నందికొట్కూరు తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య
కదిరి - కందికుంట యశోదా దేవి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్
సత్యవేడు - కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్
పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి
మదనపల్లి - షాజహాన్ బాషా
పల్నాడులో నరసరావుపేట అభ్యర్థిని తప్ప మిగతా అభ్యర్థులందరిని ప్రకటించిన టిడిపి. ఇప్పటికే అరవింద బాబు పై పలు సర్వేలు నిర్వహించినప్పటికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్ బిజెపికి అప్పగించిన సంగతి తెలిసిందే. మళ్లీ 2024 లో రిపీట్ అవుతుందేమో చూడాలి.
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp
ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్
ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్
చిలకలూరిపేట :- టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో 17వ తారీకు అనగా ఆదివారం నాడు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి పనులని చకచగా కార్యరూపం దాల్చడంతో సభ నిర్వహించేందుకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు, బిజెపి పార్టీ నుండి నాగభూషణం, జనసేన పార్టీ నుండి గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ చిలకలూరిపేట తోట రాజా రమేష్ మరియు టిడిపి, జనసేన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సభ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి ఉమ్మడి మేనిఫెస్టో సభ నభూతో నభవిష్యతీ అన్నట్టుగా ఉంటుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యమైందని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రాభివృద్ధికి కొత్తబాటలు వేస్తాయన్నారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కలవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సభకు బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయి ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భాజపాతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు సుమారు 15లక్షల మంది జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. పైగా ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సభ చిలకలూరిపేట కావటంతో ప్రత్తిపాటి పుల్లారావుపై బాధ్యతలు పెరిగాయని లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్తో భేటీ తర్వాత పుల్లారావు మీడియాలో మాట్లాడుతూ 17న జరిగే సభతోనే జగన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుందని, తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్లో 175 నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని వెల్లడించారు. లక్షలాది మందితో జరిగే ఈ సభ దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. దేశానికి మోదీ ఒక దశ దిశ అయితే.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికి చంద్రబాబు, పవన్కల్యాణ్ దశ దిశ అన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా దేశానికి ఒక సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజలను కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషం, ఆడబిడ్డలు క్షేమం, యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ బహిరంగ సభ దిక్సూచిలా ఉంటుందని తెలిపారు.
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp
చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్
నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్
నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.
వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Follow this link:
https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు
చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.
Follow
దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు
దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు
చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం
చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం
చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Follow this link to join my WhatsApp group:
ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?
ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?
మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.
భార్య కళ్లెదుటే దారుణం..
జేఎన్టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.
అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.
హతుడి పక్కనే కూర్చొని..
మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్లర్లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
వివాదరహితుడు
మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
Follow this link to join my WhatsApp group:
ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య
ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య
చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి
చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి