విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ
చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయుటను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయి డెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని, ఇప్పుడు ఆ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన ఐదు వేల రూపాయలు ఉండవలసిన ఫీజులు 20000 ,పాతిక వేలు అవటం వలన ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది అని, అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే విధులు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జి వో నెంబర్ 46 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, మునీర్ హసన్, కాకుమాను రమేష్ ,భాష, మల్ల కోటి,అమరేశ్వరి, కోటేశ్వరమ్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.