చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించని పక్షంలో చర్యలు తప్పవు
పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బన్ సీఐ రాజేశ్వరరావు గుర్తించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా మార్కెట్ సెంటర్ లోని మెయిన్ బజార్లో ట్రాఫిక్ పోలీస్ను నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ లలో రోడ్లపైకి పార్కింగ్ వెహికల్స్ రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన దారుల వల్ల పాదచారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ సిఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.
No comments:
Post a Comment