రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు
చిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భార్య భర్తలు దుర్గాప్రసాద్, హైమావతి గాయపడ్డారు. అదే సమయంలో లో నరసరావుపేట నుంచి చిలకలూరిపేట కి వస్తున్న టౌన్ సిఐ రాజేశ్వరరావు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీఐ రాజేశ్వరరావు తీసుకున్న తక్షణ నిర్ణయానికి, మానవతా దృక్పథానికి హ్యాట్సాఫ్ తెలిపారు.
No comments:
Post a Comment