విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.
చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలోఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి, లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేశారు.
No comments:
Post a Comment