మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు ఎముకలు ఏమి విరిగిన శస్త్రచికిత్సతో కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు పొందినది పూనాటి కుటుంబం. అయితే ఆ కుటుంబం లో ఒకరైన వైద్య నిపుణులు పునాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. అవిసాపాలెం కట్టు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతటి గుర్తింపు కలిగిన వీరి వద్దకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. 1900 సంవత్సరం నుండి పూనాటి వీరయ్య చౌదరి తదనంతరం వారి కుమారులు ఇప్పుడు వారి మనవళ్లు, ముని మనవాళ్ళు, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. పూనాటి వెంకటేశ్వర్లు మృతి పట్ల గ్రామ పెద్దలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు.



Share:

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.

                                                VIDEO  మీకోసం 

Share:

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము -  చిలకలూరిపేట జనసేన పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయుటను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయి డెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని, ఇప్పుడు ఆ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన ఐదు వేల రూపాయలు ఉండవలసిన ఫీజులు 20000 ,పాతిక వేలు అవటం వలన ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది అని, అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే విధులు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జి వో నెంబర్ 46 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా వారికి జనసేన పార్టీ  అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, మునీర్ హసన్, కాకుమాను రమేష్ ,భాష, మల్ల కోటి,అమరేశ్వరి, కోటేశ్వరమ్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.



Share:

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 భాగంగా ఈరోజు భారత్ నమీబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న భారత్. మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్ లకు గాను 8 వికెట్ల కష్టానికి 132 పరుగులు చేసింది. నమీబియా మొదట తడబడి 100 లోపే స్కోర్ నమోదు చేస్తుంది - అని అందరూ అనుకున్నారు. కానీ 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ లక్ష్యఛేదనలో 152 ఓవర్లకే ఫినిష్ చేశారు. గెలిచిన ఓడటం ఏంటి అనుకోవచ్చు - కానీ భారత్ సెమీ ఫైనల్స్ వెళ్లాలంటే మరొక మ్యాచ్ గెలవాల్సి ఉంది. కానీ భారత్ అంతకుముందే రెండు మ్యాచ్లను ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ మాత్రం సెమీ ఫైనల్కు వెళ్లదు.

2021 టి-20లో భారత్ కు ఇది చివరి మ్యాచ్. దీంతోపాటుగా విరాట్ కోహ్లీ కి కెప్టెన్గా తన చివరి మ్యాచ్. అలాగే కోచ్ గా ఉన్న రవి శాస్త్రి కి కూడా ఇది చివరి మ్యాచ్. తరువాత జరగబోయే టి 20 లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. అలాగే టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పగ్గాలు చేపట్టనున్నారు.




Share:

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భార్య భర్తలు దుర్గాప్రసాద్, హైమావతి గాయపడ్డారు. అదే సమయంలో లో నరసరావుపేట నుంచి చిలకలూరిపేట కి వస్తున్న టౌన్ సిఐ రాజేశ్వరరావు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీఐ రాజేశ్వరరావు తీసుకున్న తక్షణ నిర్ణయానికి, మానవతా దృక్పథానికి హ్యాట్సాఫ్ తెలిపారు.





Share:

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్  మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలోఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి, లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు గుర్తించారు. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రధానంగా మార్కెట్ సెంటర్ లోని మెయిన్ బ‌జార్‌లో ట్రాఫిక్ పోలీస్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ లలో రోడ్లపైకి పార్కింగ్ వెహికల్స్ రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన దారుల వల్ల పాదచారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ సిఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.



Share:

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.చౌత్రా సెంటర్లోని శివాలయం పాటిమీద పెద్ద శివాలయాల్లో శివనామస్మరణతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం రోజున భక్తులు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన పూర్తిచేసుకొని అనంతరం దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలలో పాల్గొని ఉపవాస దీక్ష చేపడతారు.


వీడియో మీకోసం 






Share:

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం  బోయపాలెం నందు రంగనాయక నూలుమిల్లులో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన గిరిదారిదాస్ (27) నూలు మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనితో పాటు మిల్లు క్వార్టర్స్ లోనే అతని కుటుంబ సభ్యులు ఐదుగురు కలిసి ఉంటున్నారు. రోజులాగే శనివారం రాత్రి గదిలో నిద్రపోయాడు. ఆదివారం ఉదయం అతడు మేల్కొనకపోవటంతో కుటుంబ సభ్యులు అతను చనిపోయినట్లు గుర్తించారు. అయితే అతని మృతిపై అతని పెద్దమ్మ ఫిర్యాదు మేరకు మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణం పోస్టుమార్టంలో తేలాల్సిఉంది.  యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Share:

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సిందే కానీ న్యూజిలాండ్ గెలవడంతో రేపు జరగబోయే నమీబియా మ్యాచ్ లో భారత్ గెలిచినా సెమిస్ కి వెళ్లదు. పొద్దున నుండి భారత క్రికెట్ ప్రేమికులు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఆకాంక్షించారు. కానీ న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఇంటి బాట పట్టింది.

ఇప్పటికే ఐపీఎల్ బెంగళూరు టీంకు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ - అంతర్జాతీయ టి20 కెప్టెన్సీకి వైదొలుగుతున్నట్లు గతంలో పర్యటించాడు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీకి చివరి మ్యాచ్. T20 ఫార్మెట్లో లో కింగ్ మొత్తం 49 మ్యాచ్లకు సారథ్యం వహించగా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుపొందలేదు. అందులో 29 సార్లు గెలవగా 16 సార్లు ఓడిపోయింది టీమిండియా.




Share:

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


మాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది -  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డంపెట్టుకొని పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు కలుగజేసి, ఆరు రోజులు గుంటూరు జిల్లాలో తండోపతండాలుగా ప్రజలు రావటం చూసి మహాపాదయాత్ర ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక జగన్ మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపుతున్నారు. ఆ రైతులు కన్నీరు పెట్టి దగ్గర బాగుపడ్డటు చరిత్రలో లేదు. అమరావతి రైతులు పాదయాత్ర అడ్డుకోవాలనే పన్నాగం పన్నాడు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 35 వేల ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుందామని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మి అమరావతి రైతులు ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటమార్చి రైతులను బాధలకు గురి చేసి, వారు చేస్తున్న దీక్షలు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకోకుండా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహరించటం చాలా దుర్మార్గమైన చర్య. హైకోర్టు అమరావతి రైతులు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గ్రహించాలి. ఇది ఒక అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు అండగా ఉండాలి. అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై  విరుచుకుపడ్డారు.గతంలో ప్రభుత్వాలు పేదలకు 1983 నుంచి గృహాలు & స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఆ స్థలాల మీద 10 వేల నుంచి 15 వేల రూపాయల కట్టమని పేద ప్రజలను భయభ్రాంతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాలంటరీ వారు డబ్బులు కట్టాల్సిందే కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అని ప్రజల్ని ఎప్పుడూ ఇచ్చిన గృహాలు స్థలాల మీద ఇలా టాక్స్ వెయ్యటం ఎంతో ఘోరమైన చర్య జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం దారుణం‌ అని, కట్టిన గృహాలు సాక్షాత్తు చిలకలూరిపేట 52 ఎకరాలలో 4600 గృహాలు నిర్మాణం పూర్తయి ఉంటే ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. పాడుబడ్డ విధంగా ఆ గ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో రావడంతో అన్ని రుణమాఫీ, గృహాలకు రూపాయి కట్టే పని  లేకుండా చేస్తామని చెప్పి, పేద ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. పేద ప్రజల ఏమో అప్పోసప్పో చేసి యాభై రెండు ఎకరాల గృహాల కోసం డబ్బులు కొంత డబ్బులు కట్టారు. ఆ డబ్బులు వడ్డీలు కట్టలేక ఈ గృహాలు రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా వాలంటరీ వారిచేత పేద ప్రజల దగ్గర డబ్బులు ముక్కుపిండి వసూలు చెయ్యటం ఎంత  దుర్మార్గమైన చర్య. ఈ చర్య కు తెర లెపేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం ఎంత దారుణమైన చర్య, అంటూ తక్షణమే పేదలకు న్యాయం జరిగేలా ఉండాలి. వారి గృహాల వారికి అందించాలి. డబ్బులు వసూలు చేయటం తక్షణమే ఆపివేయాలి. అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి పై  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.




Share:

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

CM జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని హీరో షోరూం ఎదురుగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.



Share:

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .

ర్యాలీలో పాల్గొన్న మాజీ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రాజధాని రైతుల బాధలను తెలుసుకొని పునరాలోచన చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. ర్యాలీగా వెళ్లి పెదనందిపాడు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ, సిపిఐ నాయకురాలు నాగభైరు సుబ్బాయమ్మ, ప్రజా సంఘాల నేతలు, అమరావతి మద్దతుదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



Share:

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టిడిపి నుండి గెలిచి YSRCP కండువా తప్పుకున్న విషయం అందరికీ తెలిసినదే. గుంటూరు మేయర్ పదవి ప్రకటించే ముందు రెండున్నర సంవత్సరం కావటి మనోహర్ నాయుడు మరో రెండున్నర సంవత్సరం పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కేటాయిస్తున్నట్లు అప్పట్లో గుంటూరు YSRCP తెలిపింది. అయితే పాదర్తి రమేష్ గాంధీ గుండెపోటుతో మరణించడం తో ఆరో వార్డు జరగవలసిన ఉప ఎన్నికలకు టిడిపి నుండి వైసిపికి వచ్చిన మద్దాలి గిరి పెత్తనం చేస్తున్నారంటూ స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త గుజ్జుల రామకృష్ణారెడ్డి మద్దాలి గిరి విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారు. ఆరవ వార్డు స్థానికులకు కాకుండా మద్దాల గిరి సొంత ఊరైన రెంటచింతల నుండి వ్యక్తిని తీసుకొనివచ్చి అభ్యర్థిగా ప్రకటించడం తో ఈ వివాదం చెలరేగింది. సదరు వ్యక్తి గుట్కా సప్లై చేస్తూ అక్రమంగా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు అని, స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఎలా అభ్యర్థి గా పర్యటిస్తారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నుండి Ysrcp కండువా కప్పుకున్నారు అని, దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం మద్దాలి గిరి నాలుగు కోట్లు డిమాండ్ చేశారని ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు నగర వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.