మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

6 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు

6  ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తడబడింది. 17.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 85 స్కోర్ చేసింది. తరువాత దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్ శర్మ 16 బంతులకు 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 18 బంతులకు 50 పరుగులు చేశాడు. చివరలో వచ్చిన  సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించారు. 6.3 ఓవర్లకు భారత్ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆదివారం జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, భారత్ & నమీబియా మధ్య జరగబోయే మ్యాచ్ భారత్ గెలిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో ఏది తడబడినా టీమిండియా ఇంటి బాట పట్టాల్సిందే.



Share:

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ మొత్తం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతిలో వేల ఎకరాల భూములు దానం చేసిన రైతులు ఖంగు తిన్నారు. నాటి నుండి మొదలుకొని ఇప్పటికీ దీక్షలు చేస్తున్న - రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేస్తున్నారంటూ రైతులు చేసే దీక్షను పక్కదోవ పట్టిస్తున్నారని, న్యాయపోరాటానికి "న్యాయస్థానం టు దేవస్థానం" అనే నినాదంతో అమరావతి రైతులు పాదయాత్ర  మొదలుపెట్టారు. అందులో భాగంగా రేపు అనగా 6/11/2021 శనివారం నాడు పెదనందిపాడు చేరుకోనున్నారు. రేపు ఉదయం మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ గా పెదనందిపాడు తరలిరావాలని - నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మరియు అమరావతి రైతుల మద్దతుదారులు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి - 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రైతులు గళాన్ని వినిపించాలి అని చిలకలూరిపేట టిడిపి పిలుపునిచ్చింది. నియోజకవర్గం పరిధిలోని వార్డు, మండల, జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు-

 ఇట్లు 

తెలుగుదేశం పార్టీ 

చిలకలూరిపేట నియోజకవర్గం.





Share:

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.

ఇవి చేస్తే మంచిది:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఇవి చేయరాదు:

తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.





Share:

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి నుండి చిలకలూరిపేట వచ్చే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీ కొడుకులకు గాయాలు.

వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన కరిముల్లా అతని కొడుకు ఖదీర్ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలుకై చిలకలూరిపేట కు బయల్దేరారు. మార్గమధ్యలో చిలకలూరిపేట నుండి వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కిందపడిపోయారు. ఢీకొన్న ద్విచక్ర వాహనం ఆపకుండా బొప్పూడి వైపు వెళ్లిపోయారు. వెనక వచ్చే వాహనదారుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పరిశీలించారు. తండ్రి కరీముల్లా కు ఎడమ కాలు కి స్వల్ప గాయం, కుమారుడు ఖదీర్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయింది. వెంటనే అంబులెన్స్ సిబ్బంది చిలకలూరిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

Share:

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాట్ తగ్గించారు. కర్ణాటక, గోవా, మణిపూర్, యానం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలలో 7 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాయి దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 12 రూపాయలు డీజిల్ పై 17 రూపాయల భారం తగ్గింది.

ఇదిలా ఉంటే ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయి ఏమో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ సర్కార్ పెట్రోల్ పై 31 రూపాయలు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పెట్రోల్ పై 26 రూపాయల vat వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లు ఇంధన ధరల పై వ్యాట్ తగ్గిస్తే వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.



Share:

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

దీపావళి అంటేనే బాణాసంచా, దీపాల అలంకరణ, పూజా కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా టపాసు లేకుండా దీపావళి జరుపుకోవాలంటే అది పండుగలాగే ఉండదు. అయితే గత సంవత్సరం కోవిడ్ కారణంగా దీపావళి బాణాసంచా విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి లాక్ డౌన్ లేకపోవడంతో బాణాసంచా కాల్చటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నిప్పు లేకుండానే టపాసులు పేలుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే నిప్పు లేకుండా టపాసులు ఎలా పేలుతుంది అనుకుంటున్నారా !

టపాసులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు ఈ మాటే అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం బాణసంచా డబల్ రేట్ ఉండటంతో సామాన్యులు టపాసులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఒక సామాన్యుడు దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 7 సమయంలో కుటుంబంతో పాటు బాణాసంచా కాల్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం బాణాసంచా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 1000 & 1500 రూపాయలకు మనకు కావాల్సిన చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇతర టపాసులు లాంటివి తెచ్చుకొని మూడు రోజులపాటు సాయంత్రం సమయాల్లో వాటిని కాలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం తక్కువలో తక్కువ గా 4000 నుండి 5000 రూపాయల వరకు వెచ్చించవలసిన వస్తుంది. అమ్మకందారులు ట్రాన్స్పోర్టేషన్, పెరిగిన ఇంధన ధరలు వలన ఈ రేట్లు తప్పవని చెబుతున్నారు. ఏది ఏమైనా టపాసు లేని దీపావళి ఊహించుకోలేము కదా! 




Share:

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

*MLA విడదల రజిని :- 

దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు :-

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలి. తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాక్షసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, టపాసులు కాల్చిన తర్వాత చేతులు కడుక్కోవటానికి సబ్బును ఉపయోగించoడి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్:-

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి కుటుంబాలలో వెలుగు నింపాలని ఆయన కోరారు.

టౌన్ సిఐ రాజేశ్వరరావు:- 

పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా, చిన్నపిల్లల దూరంగా ఉంచుతూ సంబరాలు చేసుకోవాలి. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలి.




Share:

చితక్కొట్టిన భారత్ - కానీ!!!

చితక్కొట్టిన భారత్ - కానీ!!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ప్రపంచ కప్ టీ20ల్లో మొదటి రెండు మ్యాచుల్లో భారత్ తడబడింది కోహ్లీ సేన న్యూజిలాండ్ పాకిస్తాన్ లతో జరిగిన పోరులో భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయి విమర్శల పాలయింది. గడిచిన రెండు మ్యాచ్ లలో టాప్ ఆర్డర్స్ విఫలమవటంతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈరోజు జరిగిన ఆప్ఘనిస్తాన్ భారత్ మ్యాచ్ లో భారత్ వీర విజృంభించింది. కేఎల్ రాహుల్ 48 బంతులకు 69 రన్స్ చేయగా, హిట్ మాన్ రోహిత్ శర్మ 47 బంతులకు 74 పరుగులు చేశారు. తరువాత వచ్చిన పంత్ 13 బంతులకు 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతులకు 35 పరుగులు చేశాడు. మొత్తంగా చూసుకుంటే 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 210 భారీ స్కోరు ఆఫ్ఘనిస్తాన్కు టార్గెట్ గా ఇచ్చారు అందులో 10 సిక్స్ లు 19 ఫోర్స్ బాదారు.

తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 వరకు 7 వికెట్ల కష్టానికి 144 పరుగులు చేసింది. కానీ టీమ్ ఇండియా సెమీస్కు చేరుకోవటం కష్టం. నవంబర్ 5న స్కాట్లాండ్ తో నవంబర్ 8న నమీబియా తో టీమిండియా ఆడనుంది.



Share:

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. తాజాగా భారత ప్రభుత్వం దీపావళి సందర్భంగా పౌరులకు రేపటి నుండి అనగా దీపావళి పండుగ నుండి పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ఇంధన ధరలు రేపటి నుండి ధరలు అమలులోకి వస్తాయి. ఈ ఒక్క పూట ఆగి రేపు ఉదయం మీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ గుర్తించుకోండి.



Share:

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ పరిధిలోని దీపావళి బాణాసంచా హోల్ సేల్ దుకాణాలలో డి.ఎస్.పి విజయ భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. వీటితో పాటు రూరల్ సీఐ సుబ్బారావు పాల్గొన్నారు. హోల్ సేల్ దుకాణాలలో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా ! షాపు లైసెన్సులు, అత్యవసర అగ్నిమాపక సహాయక చర్యలను పరిశీలించారు. దుకాణదారులకు షాపులు చుట్టుపక్కల ఫైర్ యాక్టివిటీలు, ధూమపానం చేయకుండా చర్యలు తీసుకోవాలని అని ఆయన తెలిపారు. అలాగే దీపావళి బాణాసంచా కాల్చె సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా కలుసుకోవాలని, రాత్రి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కాల్చాలని ఆయన తెలిపారు.



Share:

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందించిన డాక్టర్లకు  MLA విడుదల రజిని ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ :-

కోవిడ్ సమయంలో ఎనలేని సేవలందించిన డాక్టర్లకు సత్కారం చేయటం మంచి ఆలోచన అని ముఖ్యంగా సెకండ్ వేవ్ నందు కొత్త వైద్య సిబ్బందిని, తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని. అలాగే ప్రభుత్వం కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలను అందించిందని. అలాగే కోవిడ్ టీకాలను అందించామని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలను అందించమని వెంటనే మీ సమీప ANMలను సంప్రదించాలని అని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆదేశించారని ఆయన తెలిపారు.

MLA మాట్లాడుతూ :-

MLA విడుదల రజనీ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ & కొరత బెడ్లు కొరత లేకుండా చేశామని -  క్లిష్ట సమయాల్లో కలెక్టర్ గారిని సంప్రదించగా వెంటనే అన్ని సమకూర్చారని ఆమె తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉచితంగా బియ్యం & ఆర్థిక సాయం అందజేశామని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా మన రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేశాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, క‌మిష‌న‌ర్ ర‌వీంద్ర‌,తహసీల్దార్ సుజాత,సురేష్ నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఓ,వైద్యులు గోపినాయ‌క్,లక్ష్మ నాయక్,సోమల నాయక్,కీర్తి,రాజేష్,శ్యాంసోన్. ప్రియాంక,భాగ్యలక్ష్మి,సీనియర్ డాక్టర్స్ కొల్లా అమర్,కొమ్మినేని వీరశంకరరావు, మక్కెన వంశీ, గరికపాటి వరలక్ష్మి,కందిమల్ల వాసు, వెల్లటూరి పెద్దబ్బాయి,రామకృష్ణ,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్లు కొలిశెట్టి శ్రీనివాసరావు, వలేటి వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, జడ్పీటీసీలు కాట్రగడ్డ మస్తాన్ రావు,ముక్తా వాసు,కోడె సుధారాణి,ఎంపీపీ లు దేవినేని శంకరరావు, పిడతల ఘాన్సీ,తలతోటి రాణి,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,విడదల గోపి, తులం సుధాకర్,పిల్లి సాగర్,షేక్ ఆదం వలి, చేమిటిగంటి పార్వతి,చింతపల్లి విల్సన్,షేక్ మీరాబి, షేక్ జమీలా, పుల్లగూర అనురాధ,నాయబ్ సైదాబి,షేక్ నసీమా బేగం,చెంబేటీ భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,ములకలూరి బాజి మున్నీ,యూసుబ్, షేక్ ఖాజా భాను,కొచ్చెర్ల విజయలక్ష్మి, బిట్రా రాజేంద్ర,వడితే కోట నాయక్,రమణి బాయ్, కో ఆప్షన్ సభ్యులు పొలిశెట్టి మస్తాన్,బక్షు మేస్ట్రీ,మరియు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



Share:

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ వీచిన ఫ్యాన్ గాలి - అందరూ అనుకున్నట్లే YSRCP విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో భర్త వెంకటసుబ్బయ్యకు 44,000 మెజారిటీతో గెలుపొందితే. ఇప్పుడు సుబ్బయ్య భార్య దాసరి సుధా కు 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి సురేష్ కు  21,612 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కు 6,191 ఓట్లు వచ్చాయి. దీంతో బద్వేల్ ఎన్నికల్లో YSRCP 90,089 ఓట్ల మెజారిటీతో అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంచెం తక్కువగా నమోదు అయినా కూడా భర్త వెంకట సుబ్బయ్య కన్నా డబల్ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో టిడిపి పాల్గొనలేదు.



Share:

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన మూడవ రౌండ్ కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 23,700 భారీ ఆదిత్యంలో కొనసాగుతున్నారు, తరువాత బిజెపి అభ్యర్థి పి సురేష్ 1688 ఓట్లతో, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 580 ఓట్లు పొందారు. ప్రత్యర్థులకు అందనంత ఆదిత్యం లో ఉండటంతో YSRCPపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.