మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్


Share:

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


Share:

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు - EC


మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ప్రకటించారు.

నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభం - EC. దేశవార్ధంగా 97 కోట్ల మంది ఓటర్లు, ఏపీ తో పాటుగా ఒడిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్తో పాటుగా కాశ్మీర్లో కూడా ఎన్నికలు, జూన్ 16 లోపు అన్ని ఎన్నికలను పూర్తి చేస్తాం, దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు, కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు, ఎలక్షన్ కోసం 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు. ఈ లోకసభ ఎన్నికలు దేశంలోనే 18 ఎన్నికలుగా, 85 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఇంటి (ఓట్ ఫ్రమ్ హోమ్) వద్ద నుంచి ఓటింగ్ చేసే ప్రక్రియ. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి - EC

Share:

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం

 కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం 

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం


చిలకలూరిపేట :- చిలకలూరిపేట పట్టణంలో కోలాటం వాతావరణ నెలకొన్నది. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా, మరోవైపు టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి భారీ సభకు ప్రముఖులు చిలకలూరిపేట క్యు కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి కార్యకర్తలు చిలకలూరిపేటకు క్యూ కడుతున్నారు. దేశ ప్రధాని చిలకలూరిపేటకు వస్తున్న తరుణంలో సభా ప్రాంగణానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతి లేనందువలన పట్టణంలోని ప్రజలు భారీగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్న మనోహర్ నాయుడు కి వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు నుంచి చిలకలూరిపేటకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ కూడా వివిధ పార్టీ జెండాలతో కోలాహారంగా మారింది.
Share:

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు


1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ

2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు

3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్

4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి

5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు

6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం

7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్

8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్

9 రాజాం - శ్రీ తలే రాజేష్

10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి

11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల

12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు

13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర

14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు

15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ

16 గజపతినగరం - శ్రీ  బొత్స అప్పలనరసయ్య

17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు

18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల

19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు

20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ

22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ 

23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు

24 విశాఖపట్నం పశ్చిమం -  

25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్

26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ

27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు

28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం

29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్ 

31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్

32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు

34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్

35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా

36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ వరుపుల సుబ్బారావు

37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత

38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు

39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు

40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి

41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

42 రామచంద్రపురం-  శ్రీ పిల్లి సూర్యప్రకాష్

43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్

44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్

45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు

46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్

47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి

48 మండపేట - శ్రీ  వి.జోగేశ్వరరావు

49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా

50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్

51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా

52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం

53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి

54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్

55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు

56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు

57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు

58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు

59 భీమవరం -  శ్రీ గ్రంధి శ్రీనివాస్

60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు

61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు

62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ

63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు

64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి

65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్

66 గోపాలపురం - శ్రీ తలారి వెంకట్రావు

67 పోలవరం - శ్రీ తెల్లం బాలరాజు

68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా

69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి

70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు

71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ 

72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు

73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు

74 పెడన - శ్రీ ఉప్పల రాము

75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి

76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి

77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే

78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్

79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్

80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ 

81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్

82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు

83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు

84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని

85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు

86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత

87 మంగళగిరి - శ్రీమతి కాండ్రు కమల

88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా

89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు

90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్

91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్

92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి

93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్

94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని

95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా

96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు

97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు

99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు

100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి

101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి

102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్

103 దర్శి - శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్

104 పర్చూరు - శ్రీ యడం బాలాజీ 

105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి

106 చీరాల - శ్రీ ఆమంచి కృష్ణా మోహన్

107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున

108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి

109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్

110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్

111 మార్కాపురం - శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి

112 గిద్దలూరు - శ్రీ అన్నా రాంబాబు

113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్

114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి

116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్

118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి 

120 గూడూరు -  శ్రీ మేరిగ మురళి

121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య

122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ

125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 

126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా

127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు

128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి

129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి

130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి

132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి

134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి

135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి

136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా 

137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్ 

138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి

139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి

141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి

143 కోడుమూరు - శ్రీ డా. సతీష్

144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక

145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి

146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి

147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి

148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి

149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి

150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి

151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి

152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు

153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి

154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య

155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప

157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక 

158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్

159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి

160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి

161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్

162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి

163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి

164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్

165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి

168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి

169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్

170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా

171 గంగాధర నెల్లూరు - శ్రీ ఎం రెడ్డెప్ప

172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి

173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్

174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ

175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్

Share:

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

 చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

గుంటూరు - చిలకలూరిపేట నేషనల్ హైవే మధ్యలో ఆటో ప్రైవేటు బస్సుని ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తితో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఈనాడు ఆఫీస్ సమీపంలో రాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడ నుండి కడప వెళ్తున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సును ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఆటోని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి బస్సును ఢీకొన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తులు మధ్య మధ్యలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆటోలోని వ్యక్తులు కోండ్రుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన అనంతరం రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో హుటాహుటిన ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.

Follow below

Share:

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?


34 మందితో టిడిపి రెండో జాబితాను విడుదల చేసింది.

నరసన్నపేట తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి

గాజువాక తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు

చోడవరం తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్‌.ఎస్‌. రాజు

మాడుగుల తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్‌

ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ

రామచంద్రపురం తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్‌

రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష

కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు

దెందులూరు తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు తెదేపా అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌

గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ

గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థిగా మహ్మద్‌ నజీర్‌

గురజాల తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు

కందకూరు తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి

గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్‌ రెడ్డి

ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి

కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

వెంకటగిరి తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ

కమలాపురం తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి

ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి

నందికొట్కూరు తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య

కదిరి - కందికుంట యశోదా దేవి

పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి

మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి

ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి

పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్‌

సత్యవేడు - కోనేటి ఆదిమూలం 

శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి

చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్‌

పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి 

మదనపల్లి - షాజహాన్‌ బాషా

పల్నాడులో నరసరావుపేట అభ్యర్థిని తప్ప మిగతా అభ్యర్థులందరిని ప్రకటించిన టిడిపి. ఇప్పటికే అరవింద బాబు పై పలు ‌సర్వేలు నిర్వహించినప్పటికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్ బిజెపికి అప్పగించిన సంగతి తెలిసిందే. మళ్లీ 2024 లో రిపీట్ అవుతుందేమో చూడాలి.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్


చిలకలూరిపేట :- టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో 17వ తారీకు అనగా ఆదివారం నాడు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి పనులని చకచగా కార్యరూపం దాల్చడంతో సభ నిర్వహించేందుకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు, బిజెపి పార్టీ నుండి నాగభూషణం, జనసేన పార్టీ నుండి గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ చిలకలూరిపేట తోట రాజా రమేష్ మరియు టిడిపి, జనసేన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సభ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి ఉమ్మడి మేనిఫెస్టో సభ నభూతో నభవిష్యతీ అన్నట్టుగా ఉంటుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యమైందని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రాభివృద్ధికి కొత్తబాటలు వేస్తాయన్నారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కలవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సభకు బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో లోకేష్‌ ప్రత్యేకంగా భేటీ అయి ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భాజపాతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు సుమారు 15లక్షల మంది జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. పైగా ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సభ చిలకలూరిపేట కావటంతో ప్రత్తిపాటి పుల్లారావుపై బాధ్యతలు పెరిగాయని లోకేష్‌ వ్యాఖ్యానించారు. లోకేష్‌తో భేటీ తర్వాత పుల్లారావు మీడియాలో మాట్లాడుతూ 17న జరిగే సభతోనే జగన్‌ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుందని, తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌లో 175 నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని వెల్లడించారు. లక్షలాది మందితో జరిగే ఈ సభ దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. దేశానికి మోదీ ఒక దశ దిశ అయితే.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దశ దిశ అన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా దేశానికి ఒక సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజలను కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషం, ఆడబిడ్డలు క్షేమం, యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ బహిరంగ సభ దిక్సూచిలా ఉంటుందని తెలిపారు.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు టిడిపి పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేట పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట ysrcp అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో పట్టణంలోని వైసీపీ శ్రేణులు స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికేతులలోకి టికెట్ ఇవ్వటంపై నిరసనగా ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీస్ వారు కార్యకర్తలను అడ్డుకోవడంతో వారి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఒకానొక సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి లాఠీచార్జ్ జరిగే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసు వారు సమయం పాటించి పరిస్థితిని అదుపులోకి తీసుకొని. చిలకలూరిపేట లో ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం మంత్రి విడుదల రజిని అని కార్యకర్తలు వాపోతున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వటం వలన పార్టీ పట్టును కోల్పోతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ విడదల రజిని అంటూ పట్టణ వీధుల్లో వైసిపి కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తులకు అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి రజిని ఉన్నారని కార్యకర్తలు తెలియజేశారు.

Follow 


Share:

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Follow this link:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp



Share:

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


Follow 


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.