18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని.
చిలకలూరిపేట: ఎమ్మెల్యే విడదల రజిని స్థానిక తన కార్యాలయంలో మంగళవారంముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 33 మందికి రూ.18.7 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆనందమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. రోగాల బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గతంలో రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వేలాది మందికి నియోజకవర్గంలో సీఎంఆర్ ఎఫ్ కింద ఆర్థిక సాయం అందజేశామని చెప్పారు. తాజాగా యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన రెడ్డిమాసు అరుణకుమారికి రూ.1.5లక్షల ఆర్థిక సాయం వచ్చినట్లు చెప్పారు. యడ్లపాడు మండలం కారుచోలకు చెందిన కల్లూరి సుబ్బారావుకు రూ.1.4లక్షలు, సుభాని నగర్కు చెందిన షేక్ మస్తాన్వలికి రూ.1.4లక్షలు, యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన కొండెపాటి ప్రసాద్కు రూ.లక్ష, యడ్లపాడుకు చెందిన యరపన మల్లీశ్వరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం వచ్చినట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మంజూరు తమ ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా జగనన్న ఆపన్న హస్తం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నేడు ఏదో పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని, తమ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, మున్సిపల్ ఎన్నికలే అందుకు నిదర్శమని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ దేవినేని శంకరరావు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, రాష్ట్ర ముస్లిం డైరెక్టర్ దరియా వలి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,షేక్ ఖాజా భాను,బిట్రా రాజేంద్ర,పుల్లగూర అనురాధ,మస్తాన్ వలి,యూసుబ్,తోట నాగలక్ష్మి,నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి, మద్దూరి భాస్కర్ రెడ్డి,శ్రీను,బ్రహ్మయ్య,ముక్తుమ్,హుజాఫా,జాజుల రామారావు,మరియు పలువురు పాల్గొన్నారు.