మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.

అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా  మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.



Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.