బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్
ఈ రోజు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో స్పందన 'కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF) ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జాకీర్ మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అద్యక్షులు కూరపాటి హనుమంతురావు,ఉపాద్యక్షులు మచ్చు వీరయ్య , పార్లమెంటు అదికార ప్రతినిది ధైదా చిన్న బాబు,కార్యనిర్వాహక కార్యదర్శి మాలెంపాటి ప్రవీణ్ , షేక్ సాధిక్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment