అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?
అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు .తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.
అయితే తాజాగా అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థులు తమ అటెండెన్స్ 75% మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి పథకానికి అనర్హులు అని పథకానికి అటెండెన్స్ లింక్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
అమ్మ ఒడి పథకానికి వీరు మాత్రమే అర్హులు :-
ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి
ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.
No comments:
Post a Comment