గత కొన్ని రోజుల నుండి దేశం & రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో అత్యవసర టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసారు. పట్టణ తసీల్ధార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎవరు అత్యవసరం తప్ప బయటకి ఎవరు రావద్దు, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం అని తెలిపారు.
టాస్క్ ఫోర్స్ కమిటీ పట్టణంలోని షాపుల పైనా కరోనా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని,బైక్ పైన ముగ్గురు తిరిగితే వారి పైన కేసు నమోదు చేస్తాం అని, ఈ చలానా పంపుతాం అని తెలిపారు. షాపులు నిర్వహించేవారు మాస్క్ లు వాడాలి అని అలాగే కరోనా టెస్టులు చేపించుకోవాలి తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాలలు పంచుతాం అని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి గోపి నాయక్, ఎంపీడీఓ హేమలత దేవి,కమిషనర్ రవీంద్ర ,SI సుబ్బారావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment