చిలకలూరిపేట మునిసిపల్ సమావేశంలో కొంచం సేపు రసాభాసగా మారింది. టీడీపీ , వైస్సార్సీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య ప్రోటోకాల్ పాటించటం లేదు అన్న విషయంలో కొంచం సేపు వాదోపవాదం నడిచింది. వెంటనే సభాధ్యక్షులు రఫాని కలుగజేసుకొని సభ్యులు హుందాగా ప్రవర్తించాలి అని సమయాన్ని వృధా చెయ్యవద్దు అని కోరారు. వార్డులలో జరిగే కార్యక్రమాలకి టీడీపీ కౌన్సిలర్లని ఎందుకు పిలవటం లేదు అని ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం అని కొత్త కుమారి ప్రశ్నించారు. కౌన్సిలర్లు ఉండగా ఇంచార్జులు ఏమిటి అని కౌన్సిలర్లు గా ప్రజల వద్ద గెలవని వారికీ ఇంచార్జ్ పోస్టు ఏంటి అని ప్రశ్నించారు.సమావేశంలో మాకు అవకాశం ఇవ్వటం లేదు అని గంగా శ్రీనిసరావు అడగగా గత టీడీపీ సమావేశంలో కూడా మీరు అలాగే మాకు అవకాశం ఇవ్వలేదు అని ఛైర్మెన్ రఫాని అనగా దానికి టీడీపీ సభ్యులు గతంలో మేము అలాగే చేసాం అని ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారా అని సమాధానం ఇచ్చారు. ఇంకా కొనసాగుతుంది.
క్రింద లింక్ పైన క్లిక్ చేసి వార్త పొందండి.
No comments:
Post a Comment