చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన
చిలకలూరిపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మికంగా పర్యటన. మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చిలకలూరిపేట రావటంతో RTC బస్టాండ్ సమీపంలోని బీజేపీ కార్యాలయం కోలాహలంగా తయారు అయింది. చిలకలూరిపేట పట్టణంలోని పలు సమస్యల పైనా పట్టణ బీజేపీ ఇంచార్జ్ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావుతో చర్చించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ జిల్లా సెక్రెటరీ చెరుకూరి ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. కరోనా నుండి తపించుకొని బ్లాక్ ఫంగస్ తో మృతి చెందటం బాధాకరం అని, అయన లేని లోటు పూడ్చలేనిది అని తెలిపారు. అనంతరం ప్రెస్ మీట్ఏర్పాటు చేసివైస్సార్సీపీ ప్రభుత్వం చేసే అధికార దుర్వినియోగం గురించి చర్చించారు. ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా తో రాష్ట్రము మొత్తం దోచేస్తున్నారు అని తెలిపారు. అనంతరం సాధినేని చౌదరయ్య గెస్ట్ హౌస్ నందు అధికారులతో మాట్లాడారు.
No comments:
Post a Comment