చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ హాళ్లు నందు ఈ రోజు అనగా బుధవారం నాడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో 45 అంశాలతో కూడిన అజండాతో కౌన్సిల్ పారంభించారు. ఈ సమావేశమలో మునిసిపల్ కౌన్సిల్ అంతా సభ్యులతో నిండిపోయింది. చెర్మన్ రఫాని అధ్యక్షతన మొదలైన సభలో పలు ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పురపాలక నిధులు తక్కువగా ఉన్నందు వలన అడ్డ రోడ్డు రోడ్డు సెంటర్ నందు ప్రతిపాదనలో ఉన్న ఆర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలి అని టీడీపీ సభ్యులు తెలిపారు. అలాగే సింగల్ టెండర్లను అనుమతించకూడదు అని టీడీపీ సభ్యుడు గంగా శ్రీనివాసరావు తెలిపారు. టెండర్ వెయ్యటానికి ఎవరు రానందున వచ్చిన సింగిల్ టెండర్ ఆమోదిస్తున్నట్లు రఫ్ఫాని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు ఆమోదం తెలిపారు. అలాగే అధికారుల ఆదేశాలతో గణపవరం లోని అర్బన్ హెల్త్ సెంటర్ను నిలిపివేసినట్లు తెలిపారు.మునిసిపల్ షాపుల వేలం గడువు పెంచాలి అని టీడీపీ సభ్యులు కోరారు. ఇంకా కౌన్సిల్ కొనసాగుతుంది.
సమావేశమలోని తరువాత వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.
No comments:
Post a Comment