చిలకలూరిపేట మద్యం మత్తులో కారుని ఢీకొన్న ఆటో
చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్
చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్
చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ నిన్నటిదాకా కాబట్టి మనోహర్ నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులతో వైసీపీని వీడి పత్తిపాటి ఆదేశాలతో నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు.
ఆమె అధికార పార్టీ వైసీపీ జడ్పిటిసి అయినా దగ్గర నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదు దుర్మార్గులని నమ్మి మోసపోయాం ప్రజలు మమ్మల్ని నమ్మి జడ్పిటిసి గెలిపిస్తే ప్రజలకు ఏమి చేయలేకపోయాం అనే ఆవేదన బాధ జడ్పిటిసి లో ఉంది.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని నిర్ణయించుకుంది అందుకోసమే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి నారా లోకేష్ గారి సమక్షంలో కలిసి చిలకలూరిపేటకు విడుదల రజిని చేసిన అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుందు నారా లోకేష్ సమక్షంలో తెలియపరిచి.
వైసీపీని వీడి జడ్పిటిసి కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులు టిడిపిలో చేరారు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకుడు ప్రత్తిపాటితోనే నడుచుకుంటాం అంటూ వారి కుటుంబ సభ్యులు నారా లోకేష్ సమక్షంలో విన్నవించుకున్నారు.
మరిన్ని వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.
నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్డేట్లు: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (BIEAP) మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని భావిస్తున్నారు.
అధికారిక విడుదల ప్రకారం, బోర్డు కార్యదర్శి AP ఇంటర్ ఫలితాలను 2024 ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రకటిస్తారు. ఫలితాలను BIEAP అధికారిక వెబ్సైట్లలో bie.ap.gov.in మరియు bieap.apcfssలో యాక్సెస్ చేయవచ్చు. .in.
సాధారణంగా, బోర్డు గత సంవత్సరాల ట్రెండ్లను అనుసరించి రెండు తరగతుల (ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం) ఏకకాలంలో ఫలితాలను ప్రకటిస్తుంది.
LiveMintలో అన్ని AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్డేట్లను ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
మొదటి సంవత్సరం పరీక్షలలో, 2,66,326 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 61% ఉత్తీర్ణత రేటును సూచిస్తుంది, అయితే రెండవ సంవత్సరం పరీక్షలలో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 72% ఉత్తీర్ణత రేటును ప్రతిబింబిస్తుంది.
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్షీట్లో సమాచారం ఉంటుంది..
మార్క్షీట్లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలి?
AP ఇంటర్ ఫలితాలు 2024ను యాక్సెస్ చేయడానికి, అవి ప్రచురించబడిన తర్వాత, ఈ దశలను అనుసరించండి:
resultsbie.ap.gov.in లేదా bie.ap.gov.inకి నావిగేట్ చేయండి.
IPE 1వ సంవత్సరం ఫలితం లేదా IPE 2వ సంవత్సరం ఫలితం కోసం ఎంపికను ఎంచుకోండి.
లాగిన్ పేజీలో మీ పుట్టిన తేదీ మరియు హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయండి. మీ ఫలితాలను సమీక్షించండి.
భవిష్యత్ సూచన కోసం కాపీని ప్రింట్ చేయడం లేదా స్కోర్లను సేవ్ చేయడం మంచిది.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
హోమ్పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్పై క్లిక్ చేయండి.
మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.
మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది.
AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్ను డౌన్లోడ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి.
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్షీట్లో సమాచారం ఉంటుంది..
మార్క్షీట్లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్షిప్లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు
AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్సైట్ల జాబితా
AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్సైట్ల జాబితా ఇక్కడ ఉంది
results.apcfss.in bie.ap.gov.in
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: తేదీ మరియు సమయాన్ని తనిఖీ చేయండి
2024కి సంబంధించిన AP ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఏప్రిల్ 12, 2024 ఉదయం 11 గంటలకు ప్రకటించబడతాయి. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయవచ్చు.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్సైట్ల జాబితా
AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్సైట్ల జాబితా ఇక్కడ ఉంది
results.apcfss.in bie.ap.gov.in
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్షిప్లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు
AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.
AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
హోమ్పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్పై క్లిక్ చేయండి.
మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.
మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది.
AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్ను డౌన్లోడ్ చేయండి.
భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి..
మీరు చిలకలూరిపేట వారైతే క్రింది లింకుపై క్లిక్ చేయండి.
చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు
చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు
చిలకలూరిపేట:- తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆద్వర్యంలో,శ్రీ గంగా భవాని ప్లంబర్స్ యూనియన్ అద్యక్షులు నిశ్శంకర పిచ్చేశ్వరరావు గారి నాయకత్వంలో యూనియన్ కు చెందిన 70 కుటుంబాలకు చెందిన300 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పాత ఆంధ్రా బ్యాంకు ప్రాంగణంలో మాజీ మంత్రి వర్యులు,రాష్ర్ట పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వీరందరూ పార్టీలో చేరడం జరిగింది. ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్లంబింగ్ కార్మికులు ఒక్క రోజు పని చేయకుంటే మొత్తం ప్రజా జీవనం స్తంభించి పోతుందని, మీ కష్టాలు నాకు బాగా తెలుసునని,మీ యూనియన్ సభ్యులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అద్యక్షులు పిచ్చేశ్వర రావు పుట్టిన రోజు జన్మ దిన కేక్ ను ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మా భవన కార్మికులను అన్యాయం చేసిన ఘనుడు జగన్ రెడ్డి ఎంతోమందిని కొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు జగన్ రెడ్డి భావన కార్మికుల పనులను విచ్చలవిడితనంగా అవినీతి చేసిన చరిత్ర జగన్ రెడ్డికి తగ్గుతుంది ఎంతోమంది కష్టం చేసే పని చేసుకునే వారి ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గున్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం.
ఒక్క అవకాశం అంటే విడుదల రజిని జగన్ రెడ్డిని నమ్మి మోసపోయాం. ఎప్పటికీ ఎల్లప్పుడూ పత్తిపాటితోనే నడుచుకుంటాం తెలుగుదేశం పార్టీ నీడలోనే ఉంటాం ఈ పార్టీలోనే అభివృద్ధి చెందే విధంగా పనులు చేసుకొని బ్రతుకుతాం అంటూ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి
ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి
చిలకలూరిపేట - రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న వైకాపా కుయుక్తులపై అప్రమత్తత, సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతునే జగన్ కుట్రలను ప్రతిఒక్కరు జాగ్రత్తగా గమనించాలని కోరారు. దువా చదివి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించేందుకు ముస్లింల ఆశీస్సులు అందించాలని కోరారు. నిజానికి ఎన్ఆర్సీ, సీఏఏ, ట్రిపుల్ తలాక్, కశ్మీర్కు సంబంధించిన 370 ఆర్టికల్పై లోక్సభ, రాజ్యసభలో బలపరిచింది వైసీపీనే అని మండిపడ్డారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేసిన ఆయన కొందరు స్వార్థంకోసం ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజైనా ముస్లిం మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి అందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు ప్రత్తిపాటి. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకబడ్జెట్, ఏటా రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. హైదరాబాద్లో హజ్ హౌస్తో పాటు రూ.25 కోట్లతో కడపలోనూ హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. తెలుగుదేశంతోనే షాదీఖానాలు వచ్చాయన్న ప్రత్తిపాటి గతంలో దుల్హన్ పథకాన్నీ వైకాపా నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మసీదుల ఇమామ్లకు రూ.5 వేలు, మౌజమ్లకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అనే అన్నారు ప్రత్తిపాటి. మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికలకు రూ.50 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసి కాపాడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజుకీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు, తెలుగుదేశం అంటే అంత గౌరవం అన్నారు ప్రత్తిపాటి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నమ్మకాన్ని కదల్చలేరని కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం సోదరులకు మరింత సంక్షేమాన్ని అందించి తీరతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు
చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు.
గత మూడు నెలలుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యునియన్(AITUC) నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దె ఇళ్లల్లో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు.
గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగు చేయాలని, క్రొత్త పారిశుద్ధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.
సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది.
రెండు రోజులలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?
చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.
చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్
చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్
చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు.
2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్ ల కొరత ఉన్నవి.
3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.
4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.
5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.
6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.
7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.
8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.
9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక
చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.
విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి
విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి
చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.
మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.
కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల
కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్లోనే పెట్టింది.
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది.
రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్లో ఉంచింది.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:-
కడప నుంచి బరిలో YS షర్మిల
రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు
బాపట్ల నుంచి జెడి శీలం
కాకినాడ నుంచి పళ్ళం రాజు
అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్
విశాఖ నుంచి సత్యారెడ్డి
ఏలూరు నుంచి లావణ్య
రాజంపేట నుంచి నజీర్ అహ్మద్
చిత్తూరు బరిలో చిట్టిబాబు
హిందూపురం నుంచి షాహిన్
ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి
మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.
చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...
చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...
చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న మల్లెల రాజేష్నాయుడుగారు వైకాపాను వీడి శుక్రవారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో మల్లెల రాజేష్నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్నాయుడుగారికి పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్గారితోపాటు 25 మంది చిలకలూరిపేట నియోజకవర్గ కీలకనేతలు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు కప్పుకున్నారు. తెదేపాలో చేరినవారిలో యడ్లపాడు మండల జడ్పీటీసీ సభ్యులు ముక్తా వాసు, చిలకలూరిపేట మునిసిపల్ వైస్ ఛైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మునిసిపల్ కౌన్సిలర్లు తులం సుధాకర్, చెమిటిగంటి పార్వతిదేవి, బిట్రా రాజేంద్రప్రసాద్, షేక్ జమీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిలర్, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు పంగులూరి వెంగళరాయుడు, వైకాపా సీనియర్ నాయకులు గాలి బుచ్చయ్య, బీసీసెల్ పట్టణ అధ్యక్షుడు, వైసీపీ ముఖ్య నాయకుడు ఎం.వి.రత్నారెడ్డి, మహిళావిభాగం పట్టణ అధ్యక్షురాలు యాదాల సుజాత, బుక్కాపురం సర్పంచ్ అల్లం ఆంజనేయులు, విద్యార్ధి విభాగం నాయకులు నాగూర్, ఇక్భాల్, గౌస్లు, సీనియర్ నాయకులు రామిశెట్టి తాండవేశ్వరరావు, తోట సీతయ్య, కోట నాగపూర్ణచంద్రరావు, గుంజి బాజిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు TDP లో చేరారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి
https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY
నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...
నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...
1. విజయనగరం లోక్సభ - అప్పలనాయుడు,
2. ఒంగోలు లోక్సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి,
3. అనంతపురం లోక్సభ - అంబికా లక్ష్మినారాయణ,
4. కడప లోక్సభ- చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేర్లు ప్రకటన..
1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు,
2. భీమిలి - గంటా శ్రీనివాసరావు,
3. పాడేరు - వెంకటరమేష్ నాయుడు,
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి,
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం,
6. ఆలూరు - వీరభద్ర గౌడ్,
7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం,
8. అనంతపురం అర్బన్ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్,
9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్ పేర్లను ప్రకటించిన టీడీపీ
మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.
ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..