చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డి పాలెం వద్ద మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ కారును ఢీకొన్న ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పర్చూరు నుంచి నరసరావుపేట వెళ్తున్న ట్రావెల్స్ కారున, నరసరావుపేట నుండి చీరాల వెళుతున్న ఆటో పోల్రెడ్డిపాలెం సమీపంలోని అమృత పంజాబీ దాబా వద్ద ఢీకొన్నది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా కారు కుడివైపు ముందుభాగం ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.
క్రింది లింకు పై క్లిక్ చేయండి
No comments:
Post a Comment