చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?
చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.
No comments:
Post a Comment