ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఒడిశా బాల చిన్నారావు అనే వ్యక్తి సాతులూరు మీదుగా నరసరావుపేట వెళ్తుండగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారావు స్కూటీని ఢీకొనడంతో తల బలంగా రోడ్డుకు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచార మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రింది లింకు పై క్లిక్ చేయండి
No comments:
Post a Comment