చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ
చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.