మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న ఇందు బస్ ట్రావెల్స్ తెల్లవారుజామున గం 4:15 ఈ సమయంలో జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనకు ముఖ్యకారణం డ్రైవర్ నిద్ర మత్తు వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన లో ఐదుగురికి స్వల్ప గాయాలు అవగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఒక హుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందించి తీవ్రగాయాలైన చంద్రమోహన్, కటారి సురేష్ బాబులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.



Share:

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు. పట్టణంలోని బిజెపి నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణానికి ప్రభుత్వం అనేక నిధులను కేటాయించిందని ముఖ్యంగా చిలకలూరిపేట బైపాస్ పనులు త్వరగా పూర్తిచేయాలని.. ఆలస్యానికి గల కారణాలను రాష్ట్ర మంత్రులతో చర్చించి త్వరగా బైపాస్ పనులు పూర్తిచేయాలని.. అలాగే చీరాల ఓడ రేవు నుండి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట, పిడుగురాళ్ల వరకు బైపాస్ పనులను త్వరగా మొదలు పెట్టాలని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కోరామని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం కింద సుమారు 180 కోట్ల రూపాయలను కేటాయించిందని దానిద్వారా పట్టణంలోని అన్ని ఏరియాలకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని.. అలాగే ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద 4500 ఇళ్లను కేటాయించామని కానీ వాటిని ఇంకా అర్హులకు అందలేదని వాటిపై చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలపై ఆయన చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు.



Share:

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.

2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.

5. పెదతండ్రులు , పినతండ్రులు , పెద్దతల్లులు , పినతల్లులు , గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.

6. సోదరులు , పుత్రులు , మేనత్తలు , మేనమామలు , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 

7. కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినెలు , మరుదులు , బావలు , బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల ధరించరాదు.

8. మనవాళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు   గతించినచో 21 దినములు  మాల ధరించరాదు.

9. ఇంటిపేరు గలవారు , రక్తసంబంధీకులు గతించినచో  21 దినములు  మాల ధరించరాదు.

10. వియ్యాలవారు , దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు.

11. ఆత్మీయులు , మిత్రులు  గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు.

12. ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు.          దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును , కావున మాల ధరించరాదు.

13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు.

14. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు , ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది , కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును. అందువలన మాల ధరించరాదు.

15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రాజ్వరాలు అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినానను , వెంటనే దీక్ష విరమించి , గురుస్వామి ద్వారా మాల విసరర్జించి , మాలను కడిగి , దేవును వద్ద వుంచి , పై సంబరాలలో పాల్గొని , కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము , భక్తులకు శ్రేయదాయకం.

16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును , అలా కాక మాలో మాకు మాటలు , పలకరింపులు , రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు , కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి,మాల విసర్జించి,శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.

17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు,తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును,అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు.

18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని , గర్భస్రావము గాని , లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.

19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు,ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వ అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.

20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను. ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతా శుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.

21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము,చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి. అలాగే మన సన్నిదానములో కలశం వద్ద , గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి  సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.

ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని ఆయనగారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటు - మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

పైన సూచించిన అన్నియు చాలా వరకు ఏ దీక్ష చేపట్టిన సుమారుగా ఇవే నియమాలు ఉంటాయి.

ఓం శ్రీ అనాధ రక్షకనే శరణం అయ్యప్ప



Share:

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ భేదాలు, న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలను... దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన విచారణలను సేకరించి అందరి ఆమోదయోగ్యం తో బిల్లులను మార్పు చేసి మళ్లీ తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఈ సభలో అమరావతి ప్రజల పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని... కానీ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.




Share:

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మధంతో సభా విలువలను తుంగలో తొక్కి నిండు శాసనసభలో శ్రీమతి భువనేశ్వరి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి శాసనసభను కౌరవ సభగా మార్చారని.. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని అందులో భాగంగానే నేడు శాసనసభలో మహిళలపై నోటికి ఏది వస్తే అది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని. పట్టణంలోని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఘటనలను నిరసిస్తూ పట్టణంలోని NRT సెంటర్ నందు శాసనసభ్యుడు అంబటి రాంబాబు, మంత్రివర్యులు కొడాలి నాని దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాగే తాతపూడి జాతీయ రహదారిపై నిర్వహించారు టిడిపి నాయకులు.



Share:

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలోని బొందిలి పాలెం ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు అలాగా రేపు అనగా 20/11/2021 శనివారం నాడు జాగు పాలెం, బొందిలి పాలెం, చీరాల రోడ్డు, కొమరవెల్లి పాడు, గంటలమ్మచెట్టు, సుందర్ రెడ్డి హాస్పటల్, పెట్రోల్ బంక్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సిహెచ్ రామ్ బొట్లు తెలిపారు. వినియోగదారుడు సహకరించాలని ఆయన తెలియజేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అసెంబ్లీ సమావేశాల నుండి శపథం చేసి బయటికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతరం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా మాట్లాడుతూ డిగ్నిఫైడ్గా ,పరువుతో ఉంటున్న తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ప్రపంచంలోని నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు రాష్ట్రానికి తీసుకు వచ్చాను ,అని చాలా మంది రాజకీయ నాయకులతో తాను పని చేశానని తెలుపుతూ.. తన భార్య ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు.

Video

Share:

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని సభ్యులను విమర్శించారని అయినా తాము పట్టించుకోలేదని, చివరకు తన భార్యపై సభలో చర్చ జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ తాను ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.



Share:

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ సమావేశం ఈ ఒక్కరోజు మాత్రమే అని స్పీకర్ తమ్మినేని సీతారాం అనగా.. వెంటనే తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించుకోవాలి అని 15 రోజులు అయినా సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. వెనువెంటనే సీఎం జగన్ కలుగజేసుకుని పెద్దాయన అచ్చన్న అడిగినందుకు అయినా ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బదులిచ్చారు. అయితే సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని - అంతటితో ఆగకుండా చంద్రబాబు అసెంబ్లీ సమావేశం హాజరుకావాలని, ఆయన మొహం ఒకసారైనా చూడాలని ఉందని సీఎం జగన్ అచ్చన్నను కోరారు. చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా "ఉమెన్ ఎంపవర్ మెంట్" టాపిక్ పైన చర్చించారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి  - ఎవరు ? ఎక్కడ !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి 10 వార్డ్ కడిమికొండ శ్రీలక్ష్మి (టిడిపి రెబల్) ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే శ్రీలక్ష్మి టిడిపి రెబల్ అవ్వటంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



Share:

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామంటేనో, చనిపోయినప్పుడు బంధువులకు సమాచారం అందించేటప్పుడో, కోపం లోనో లేదా ఆనందంలోనో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనకు చిరాకు తెప్పించే విషయం కరోనా కాలర్ ట్యూన్. దీనివలన మనం చెప్పాలనుకున్న విషయం చెప్పలేక కాలర్ ట్యూన్ మీద కోపంతో విసిగిపోయి ఉన్నారా !  అయితే ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కరోనా కాలర్ ట్యూన్ వినబడితే వెంటనే 1 నొక్కండి అప్పుడు ట్యూన్ ఆగిపోయి రింగింగ్ శబ్దం వినబడుతుంది.

ఒకవేళ నీ ఫోన్ కి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారికి కరోనా కాలర్ ట్యూన్ వినపడకుండా ఉండాలంటే !

BSNL :- UNSUB అని టైప్ చేసి 56700 & 56799 నెంబర్కు కు మెసేజ్ చేయండి.

AIRTEL :-CANCT అని టైప్ చేసి 144 ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి.

JIO :- STOP అని టైప్ చేసి 155223 ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.



Share:

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ -  తృటిలో తప్పిన ప్రమాదం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఉన్న స్పీడ్ రిసిస్టర్స్ వద్ద కారును స్లో చేయగా, వెనక నుండి వచ్చిన లారీ కారును ఢీ కొనడంతో కారు డివైడర్ పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో కారు వెనుక భాగంతో పాటు ముందు భాగం కూడా ధ్వంసం అవ్వగా లోపలున్న ప్రయాణికులకు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగం తగ్గడంతో ప్రమాద స్థాయి తక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.



Share:

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరవేశాయి అక్కడి వైసీపీ శ్రేణులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు మొత్తం 24 వార్డుల గాను ఒక వార్డు ఏకగ్రీవం అవగా 12 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటివరకు వైసిపి 13 అభ్యర్థులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. 2 టిడిపి అభ్యర్థులు గెలిచి ఉన్నారు. మిగిలిన వార్డుల్లో టిడిపి ఆదిక్యత చూపిస్తుంది.



Share:

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్ష ధోరణితో  ఎయిడెడ్ పాఠశాలల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయు కార్యక్రమాన్ని తలపెడితే, అప్రజాస్వామికంగా విద్యార్థి సంఘాల నేతలను కనీసం శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,  ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాని నడపడానికి అప్పులు  దొరకని తరుణంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూముల్ని స్వాధీనం చేసుకుని వాటితో అప్పులు తెచ్చుకోవాలని చూడండం దారుణం అన్నారు. నాడు అమ్మఒడి ఇస్తామని అధికారంలోకి వచ్చి  నేడు అమ్మకానికి బడిని పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములు స్వాధీనం చేసుకోవాలని తీసుకువచ్చిన జీవో నెం.50, 51లను రద్దు చేయకపోతే  విద్యార్థులుతో మరియు యువజన సంఘలుతో  కలిసి ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చెప్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర TNSF కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్, గుంటూరు పార్లమెంట్ TNSF అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ TNSF అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు మరియు పలు TNSF విద్యార్థి సంఘాలు పాల్గొనడం తదితరులు జరిగింది.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.