మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ సమీపంలో పండగ సందర్భంగా పిండివంటలు చేస్తున్న ఒక ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శారదా హైస్కూల్ సమీపంలోని కావమ్మ గుడి బజార్లోని నాయుడు భవాని అనే మహిళ పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవడంతో గ్యాస్ బయటికి వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలో సదరు మహిళ ప్రమాదాన్ని గమనించి ఇంట్లో నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేసి అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు. మహిళకు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆ ఈ ప్రాంతంలోని ప్రజలు ఊపిరి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

 చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు వచ్చిన వ్యక్తి దానిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెహికల్ సీటు వేడిగా ఉండటంతో ఆ వ్యక్తి వెహికల్కు స్టాండ్ వేసి పక్కకు వచ్చారు. ఇదే సమయంలో వెహికల్లో నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఎలక్ట్రికల్ వెహికల్ విలువ సుమారు 60 వేల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా.





Share:

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జాతీయ పార్టీ అయిన నవతరం పార్టీకి కేటాయించింది. మళ్లీ ఈ నాడు బద్వేల్ ఉప ఎన్నికలకు కూడా గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే ఎన్నికల సంఘం కేటాయించారు. ఈ విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరఫున డాక్టర్ గోదా రమేష్ బాబు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Share:

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.

అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా  మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్ లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా మంచినీరు చెరువు వెళ్లి దారులు భయంకరంగా మారాయి. వాహనదారులు మరియు వాకింగ్ కి వెళ్లే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోటప్ప కొండ వైపు నుండి చెరువు రోడ్డు మీదుగా వైయస్సార్ కాలనీ రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డులోకి ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం సమయాలలో సుమారు 20 నుండి 30 టిప్పర్ వాహనాలు గ్రానైట్ లోడుతో వెళుతుంటాయి. దీంతో చెరువు రోడ్డు మొత్తం దెబ్బ తిన్నది. స్థానికుల సమాచారం మేరకు ఆయా గ్రానైట్ సంబంధించిన వారు రోడ్డుపై కంకరతో చదును చేపించారు.  అయినప్పటికీ వాహనాల టైర్లు కంకరలో ఇరుక్కు పోవటంతో సదరు గ్రానైట్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన డస్ట్ ని తీసుకువచ్చి రోడ్లపై పోశారు. దీంతో రోడ్డంతా దుమ్ముతో మరియు గుంతలతో వాహనదారులు & వాకింగ్ కి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మున్సిపల్ శాఖ దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించే వలసిందిగా వాకింగ్ కు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఏరియాలో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న  సమయంలో ఇలాంటి  పరిస్థితులు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయని. అలాగే పట్టణంలోనే ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు రోడ్ లోనే ఉంటుందని దానిని ఇలా నాశనం చేయవద్దని వారు కోరారు.






Share:

చిలకలూరిపేట మండలం :- ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

 చిలకలూరిపేట మండలం :-  ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న లారీ టైర్ పడటంతో డ్రైవర్ దానిని తాతపూడి జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద ఆపారు. ఆయా లారీ కి సంబంధించిన క్లీనర్ పగిలిన టైర్లను మార్చి వేరే టైర్ మార్చే క్రమంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న మరో లారీ వెనక నుండి వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ది. ఈ సమయంలో క్లీనర్ లారీ కింద టైర్ మారుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ ఘటన జరగడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ ఇబ్బంది క్లీనర్ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్ ని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ఆ సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు.



Share:

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- కరోనా సమయంలో కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సేవలు అందించిన వైద్యులకు 13వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే  దసరా పండుగ సందర్భంగా కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేరని తెలియటం వల్ల  ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు.  వైద్యులకు సన్మానం చేసే విషయంలో తర్వాత తేదీని ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.



Share:

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

జ్ఞానానికి అధిష్టాన దేవ‌త స‌రస్వ‌తి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాలు, మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో మంగ‌ళ‌వారం య‌డ్ల‌పాడు మండ‌లంలోని బోయ‌పాలెంలో వేంచేసి ఉన్న ప్ర‌సిద్ధ పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌జేశారు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఉత్స‌వాల్లో భాగంగా ఎమ్మెల్యే అమ్మ‌వారికి వ‌స్త్రాలు బ‌హుక‌రించారు. ఈ స‌ద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తార‌ని తెలిపారు. సరస్వతి అమ్మ‌వారు బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటార‌ని తెలిపారు. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుందన్నారు. బోయ‌పాలెంలోని పార్వ‌తి దేవి అమ్మ‌వారి ఆలయానికి వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంద‌ని తెలిపారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యం త‌రువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాశ‌స్త్యం క‌లిగిన ఆల‌యం బోయపాలెంలోని అమ్మ‌వారి ఆల‌య‌మేన‌ని చెప్పారు. ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే గొప్ప అవ‌కాశం త‌న‌కు ద‌క్క‌డం త‌న అదృష్ట‌మ‌ని తెలిపారు. తొలుత ఎమ్మెల్యేను అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో జడ్పీటీసీ ముక్తా వాసు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,ఎంపీటీసి సయ్యద్ సుభాని,బింజు బుల్లయ్య,ఉన్నవ సర్పంచ్ ఏసోబు, నాయకులు ఖాదర్ బాషా,శ్రీను నాయక్,గుత్తి సింగయ్య,పల్లపు లక్ష్మీనారాయణ, వంకదారి శ్రీనుబాబు,పందుల బుల్లెబ్బాయి,పఠాన్ అల్లావుద్దీన్, కామినేని రామకృష్ణ మరియు పలువురు పాల్గొన్నారు.



Share:

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట‌: ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని స్థానిక త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారంముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 33 మందికి రూ.18.7 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను  ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద‌ల ఆనంద‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. రోగాల బారిన ప‌డి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. గ‌తంలో రోగాల బారిన ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందిన వేలాది మందికి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎంఆర్ ఎఫ్ కింద ఆర్థిక సాయం అంద‌జేశామ‌ని చెప్పారు. తాజాగా య‌డ్ల‌పాడు మండ‌లం సొల‌స గ్రామానికి చెందిన రెడ్డిమాసు అరుణ‌కుమారికి రూ.1.5ల‌క్ష‌ల ఆర్థిక సాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. య‌డ్ల‌పాడు మండ‌లం కారుచోల‌కు చెందిన క‌ల్లూరి సుబ్బారావుకు రూ.1.4ల‌క్ష‌లు, సుభాని న‌గ‌ర్‌కు చెందిన షేక్ మ‌స్తాన్‌వ‌లికి రూ.1.4ల‌క్ష‌లు, య‌డ్ల‌పాడు మండ‌లం ఉన్న‌వ గ్రామానికి చెందిన కొండెపాటి ప్ర‌సాద్‌కు రూ.ల‌క్ష‌, య‌డ్ల‌పాడుకు చెందిన య‌ర‌ప‌న మ‌ల్లీశ్వ‌రికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తాల్లో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల మంజూరు త‌మ ప్ర‌భుత్వంలోనే సాధ్య‌మ‌ని చెప్పారు. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తి ఒక్కరికి ఏదో ఒక ప‌థ‌కం ద్వారా జ‌గ‌న‌న్న ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి నేడు ఏదో ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అందుతోంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేద‌ని వెల్ల‌డించారు. ఇంత గొప్ప ప్ర‌భుత్వానికి ప్ర‌జల మ‌ద్దతు ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని, త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స‌ర్పంచి, మున్సిపల్ ఎన్నిక‌లే అందుకు నిద‌ర్శ‌మ‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ దేవినేని శంకరరావు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, రాష్ట్ర ముస్లిం డైరెక్టర్ దరియా వలి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,షేక్ ఖాజా భాను,బిట్రా రాజేంద్ర,పుల్లగూర అనురాధ,మస్తాన్ వలి,యూసుబ్,తోట నాగలక్ష్మి,నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి, మద్దూరి భాస్కర్ రెడ్డి,శ్రీను,బ్రహ్మయ్య,ముక్తుమ్,హుజాఫా,జాజుల రామారావు,మరియు పలువురు పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-2021 మంగళవారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు.

రహమత్ నగర్ - 1

RTC కాలనీ - 1 గా నమోదు అయ్యింది.

* sponsored by RUDRA BRAND CHILAKALURIPET *

లక్ష్మి గణపతి ఆయిల్ మిల్స్ వారి - రుద్రా బ్రాండ్ ఆయిల్ చిలకలూరిపేట స్వచ్ఛమైన వేరుశెనగ నూనె - కొబ్బరినూనె లభించును. chilakaluripetSpeedNews అనే ప్రోమోకోడ్ ఉపయోగించి 10 రూపాయల డిస్కౌంట్ పొందగలరు.






Share:

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు ‌.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

అయితే తాజాగా అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థులు తమ అటెండెన్స్ 75% మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి పథకానికి అనర్హులు అని పథకానికి అటెండెన్స్ లింక్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

అమ్మ ఒడి పథకానికి వీరు మాత్రమే అర్హులు :- 

ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.

లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి

ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.

విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.





Share:

చిలకలూరిపేట - భారీగా పట్టుబడిన గోవా మద్యం

చిలకలూరిపేట -  భారీగా పట్టుబడిన గోవా మద్యం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరి పేట ఎక్సైజ్ శాఖ - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడులలో భారీగా మద్యం పట్టుబడింది. సుమారు 30 కేసుల మద్యాన్ని గోవా నుండి తీసుకువస్తుండగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ 30 కేసుల మద్యాన్ని పెయింట్ డబ్బా మధ్యలో ఉంచి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.



Share:

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మహిళా గ్రామ వాలంటీర్ చెవుల యామినిపై రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని సోమవారం పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. యామిని తన పని తాను సజావుగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆ సంఘాల నేతలు కోరారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో వాలంటీర్ యామిని ఆవేదన, తనపై వస్తున్న దృశ్యాలను చూసి తాము స్వతహాగా  వచ్చామని వారు తెలిపారు. నాదెండ్ల చేరుకున్న నేతలు ముందుగా యామిని గృహానికి వెళ్ళారు. యామినితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన విషయాలను యామిని వారికి వివరించింది. అక్కడినుండి యామినిని వెంటబెట్టుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. దళిత వర్గానికి చెందిన యువతిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని, విషయాన్ని ఇంతటితో ముగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తరువాత తహశీల్ధార్ సురేష్ ని వారు కలిశారు. యామినికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీటీసీ కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. తమకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, అంతేకానీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ గ్రహించాలన్నారు. యామినిపై వేధింపులు కొనసాగిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యామినికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంఛార్జి, దళిత చైతన్య స్రవంతి సభ్యులు, న్యాయవాది నల్లపు కోటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వంజా ముత్తయ్య, అంటరానితనం నిర్మూలనా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దార్ల రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దావులూరి రవి కుమార్ మాదిగ, గ్రామ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, సేవా సమితి సభ్యులు అల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-2021 సోమవారం నాడు మొత్తం  1 కేసు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు.

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యింది.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.