పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయపాలెం పార్వతి దేవి అమ్మవారికి పట్టువస్రాల సమర్పణ
జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. దసరా ఉత్సవాలు, మూలా నక్షత్రం కావడంతో మంగళవారం యడ్లపాడు మండలంలోని బోయపాలెంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పార్వతి దేవి అమ్మవారికి ఎమ్మెల్యే విడదల రజిని పట్టు వస్త్రాలు అందజేశారు. వరుసగా రెండో ఏడాది కూడా ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే అమ్మవారికి వస్త్రాలు బహుకరించారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. సరస్వతి అమ్మవారు బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటారని తెలిపారు. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుందన్నారు. బోయపాలెంలోని పార్వతి దేవి అమ్మవారి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఆలయం బోయపాలెంలోని అమ్మవారి ఆలయమేనని చెప్పారు. పట్టువస్త్రాలను సమర్పించే గొప్ప అవకాశం తనకు దక్కడం తన అదృష్టమని తెలిపారు. తొలుత ఎమ్మెల్యేను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముక్తా వాసు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,ఎంపీటీసి సయ్యద్ సుభాని,బింజు బుల్లయ్య,ఉన్నవ సర్పంచ్ ఏసోబు, నాయకులు ఖాదర్ బాషా,శ్రీను నాయక్,గుత్తి సింగయ్య,పల్లపు లక్ష్మీనారాయణ, వంకదారి శ్రీనుబాబు,పందుల బుల్లెబ్బాయి,పఠాన్ అల్లావుద్దీన్, కామినేని రామకృష్ణ మరియు పలువురు పాల్గొన్నారు.