చిలకలూరిపేట నియోజకవర్గం :- 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
చిలకలూరిపేట నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తో ఉన్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అందజేశారు. తిమ్మాపురం నుండి నాదెండ్ల తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు కి చెందిన నాగేశ్వరరావును అలాగే యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన బాబు, వంశీ, కోటేశ్వరరావు లను అదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment