చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు
చిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. గణపవరం లోని కొన్ని రేషన్ డిపోలలో తనిఖీలు నిర్వహించి సూచనలు చేశారు. ఒక్కొక్క గోతానికి 20 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్లలో విక్రయిస్తే ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment