మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు ‌.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

అయితే తాజాగా అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థులు తమ అటెండెన్స్ 75% మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి పథకానికి అనర్హులు అని పథకానికి అటెండెన్స్ లింక్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

అమ్మ ఒడి పథకానికి వీరు మాత్రమే అర్హులు :- 

ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.

లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి

ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.

విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.





Share:

చిలకలూరిపేట - భారీగా పట్టుబడిన గోవా మద్యం

చిలకలూరిపేట -  భారీగా పట్టుబడిన గోవా మద్యం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరి పేట ఎక్సైజ్ శాఖ - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడులలో భారీగా మద్యం పట్టుబడింది. సుమారు 30 కేసుల మద్యాన్ని గోవా నుండి తీసుకువస్తుండగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ 30 కేసుల మద్యాన్ని పెయింట్ డబ్బా మధ్యలో ఉంచి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.



Share:

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మహిళా గ్రామ వాలంటీర్ చెవుల యామినిపై రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని సోమవారం పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. యామిని తన పని తాను సజావుగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆ సంఘాల నేతలు కోరారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో వాలంటీర్ యామిని ఆవేదన, తనపై వస్తున్న దృశ్యాలను చూసి తాము స్వతహాగా  వచ్చామని వారు తెలిపారు. నాదెండ్ల చేరుకున్న నేతలు ముందుగా యామిని గృహానికి వెళ్ళారు. యామినితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన విషయాలను యామిని వారికి వివరించింది. అక్కడినుండి యామినిని వెంటబెట్టుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. దళిత వర్గానికి చెందిన యువతిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని, విషయాన్ని ఇంతటితో ముగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తరువాత తహశీల్ధార్ సురేష్ ని వారు కలిశారు. యామినికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీటీసీ కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. తమకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, అంతేకానీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ గ్రహించాలన్నారు. యామినిపై వేధింపులు కొనసాగిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యామినికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంఛార్జి, దళిత చైతన్య స్రవంతి సభ్యులు, న్యాయవాది నల్లపు కోటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వంజా ముత్తయ్య, అంటరానితనం నిర్మూలనా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దార్ల రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దావులూరి రవి కుమార్ మాదిగ, గ్రామ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, సేవా సమితి సభ్యులు అల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-2021 సోమవారం నాడు మొత్తం  1 కేసు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు.

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యింది.




Share:

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఈ రోజు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో స్పందన 'కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF)  ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వినతి పత్రం ఇవ్వటం  జరిగింది. ఈ సందర్భంగా జాకీర్  మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అద్యక్షులు కూరపాటి హనుమంతురావు,ఉపాద్యక్షులు మచ్చు వీరయ్య ,  పార్లమెంటు అదికార ప్రతినిది  ధైదా చిన్న బాబు,కార్యనిర్వాహక కార్యదర్శి మాలెంపాటి ప్రవీణ్ , షేక్ సాధిక్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు  పాల్గొన్నారు.

Share:

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

https://chilakaluripetspeednews.blogspot.com/2021/10/40.html?m=1

ఈరోజు జరుగుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ మా ఎలక్షన్ లో వింత వాతావరణం చోటు చేసుకుంది. పొద్దు పొద్దున్నే మోహన్ బాబు సమక్షంలో మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో మా ఎలక్షన్ లో సందడి వాతావరణం నెలకొన్నది. ఈలోపే నటి హేమ శివ బాలాజీ చేతిని కోరుతున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ప్రకాష్ రాజ్ మరియు నరేష్ ఎదురు పడ్డారు. ఈలోపే ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోగా ప్రకాష్ రాజ్ ఆగ్రహంతో భీమానాయక్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన బయటికి రా రా నా కొడకా అనే రేంజ్  లో రా రా నా కొడకా నా మీద గెలువు అని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హడావిడి వాతావరణం నెలకొన్నది.


భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్



Share:

చిలకలూరిపేట నియోజకవర్గం 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

చిలకలూరిపేట నియోజకవర్గం :- 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తో ఉన్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అందజేశారు. తిమ్మాపురం నుండి నాదెండ్ల తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు కి చెందిన నాగేశ్వరరావును అలాగే యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన బాబు, వంశీ, కోటేశ్వరరావు లను అదుపులోకి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకులు

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్‌ సత్తా పార్టీ నాయకుపాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐ రాజేశ్వరరావుకు లోక్ సత్తా పార్టీ నాయకులు అందజేశారు. 

* కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురు, విధిగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

* వేకువజాము వేళలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నందున విధిగా ఆయా వేళల్లో పైన పేర్కొన్న నాలుగు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు విధులలో ఉండే లాగున ఏర్పాటు చేయాలి.

* రోజు రోజుకి ఇబ్బడిముబ్బడిగా ట్రాఫిక్ పెరుగుతున్నందున విధిగా చిలకలూరిపేట కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలి.

* డ్రైవర్ల వ్యక్తిగత అవసరాల కోసం వాహనాల పార్కింగ్ ను ఊరి చివరన స్థలాన్ని కేటాయించడం కానీ, మరేదైనా నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలను నిలుపుకొనుటకు అవకాశం కల్పించాలి.

* సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురై పాడైనందున మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవలయును.

* వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో నడిచి రోడ్డు దాటే వారికోసం ప్రత్యేకముగా నాలుగు వైపుల నుండి రోడ్డు దాటు అవకాశం కల్పించాలి.

* తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలి.

* హైవే పెట్రోలింగ్ వారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో  నిరంతరం పర్యవేక్షించ గలగాలి.

* చిలకలూరిపేట హైవే పై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున,  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు  అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేసే వారితో రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి.

* ఆగి ఉన్న లారీలను 'ఢీ' కొట్టడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో వేకువజాము వేళల్లో లారీలను హైవేపై ఆపకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

పై సూచనలను కలిగిన వినతిపత్రాన్ని సిఐ రాజేశ్వరరావుకు కు అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు మాదాసు భానుప్రసాద్

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్

ఈ కార్యక్రమంలో మురికిపూడి ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పటేల్, సాంబయ్య, శిఖాకొల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. గణపవరం లోని కొన్ని రేషన్ డిపోలలో తనిఖీలు నిర్వహించి సూచనలు చేశారు. ఒక్కొక్క గోతానికి 20 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్లలో విక్రయిస్తే ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.

Share:

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో  రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో  రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు


 చిల‌క‌లూరిపేట‌:  రేపు అనగా 09-10-21 రెండోవ శనివారం నరసరావుపేట 132/33 కేవీ సబ్ స్టేషన్ , నరసరావుపేట ఫీడర్ మరమత్తులు కారణంగా 

నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గోవిందపురం, కొత్తపాలెం  గ్రామాలకు   గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు , మరియు చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలోని పరిశ్రమల తో పాటు

మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో   మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని మద్దిరాల, పోతవరం,రా జాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి,కట్టుబడివారిపాలెం, గోపాలం వారి పాలెం, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, చిన పసుమర్రు, గుదేవారి పాలెం, మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం, నాగబైరవారిపాలెం, గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు గొట్టిపాడు గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.

Share:

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని ఒకటో వార్డు మహిళ వాలంటీర్ పై ఎంపీటీసీ వేధింపులకు పాల్పడుతున్నారు అని సదరు మహిళ వాలంటీర్ సీఎం జగనన్నకు ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. తన పేరు చెవుల యామిని నాదెండ్లలో ఒకటో వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నానని.అయితే అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయినా గుడికందుల ఎల్లారావు తనపై కుట్రలు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. దళిత వర్గానికి చెందిన తాను టిటిసి పూర్తి చేసి వాలంటర్ పనిచేస్తూ వచ్చే ఐదు వేల జీతంతో ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. తల వాలంటరీ ఈ పోస్ట్ ను తీసివేసి తన స్థానంలో ఎంపీటీసీ ప్రియురాలి కుమార్తెను వాలంటరీ చేయాలనే ఉద్దేశంతో తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఉద్దేశంతో తాను సరిగ్గా పని చేయట్లేదు సమయానికి స్పందించలేదు అనే అభియోగాలతో సంతకాలు సేకరించి ఎంపీటీసీ తనపై కుట్ర పూరితంగా ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు.

వీడియో కోసం క్రింద చూడండి







Share:

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  1319 డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజినితో పాటుగా వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. 11 సెప్టెంబర్ 2020 న మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేయగా రెండో విడతగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1319 సంఘాలకు 10 కోట్ల 86 వేల 788 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ప్రజల కష్టాలను చూస ఆర్థికంగా ముందుకు వెళ్లటం కోసం డోక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారని అని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని, కమిషనర్ రవీంద్ర,  మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.








Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.