చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
RTC బస్టాండు సమీపంలో - 2
సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.
Advertisement - 1
........
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
RTC బస్టాండు సమీపంలో - 2
సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.
మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏకంగా 50 గ్రూపులకు రూ.5 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపవరం సొసైటీ బ్యాంకు పరిధిలో గణపవరం, అప్పాపురం, కనపర్తి, ఇర్లపాడు, ఆవిశాయపాలెం గ్రామాలు ఉన్నాయని, ఈ ఐదు గ్రామాల్లో కలిపి మొత్తం 563 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిచే జీడీసీసీబీలోనే వీరంతా రుణాలు పొందాలనే గొప్ప సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాలకు అత్యల్ప వడ్డీ కేవలం 9 శాతం వసూలు చేసేది ఒక్క జీడీసీసీ బ్యాంకు మాత్రమేనని, ఇతర బ్యాంకులు 11, 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని వివరించారు. అందుకే డ్వాక్రా గ్రూపులు సొసైటీ బ్యాంకులకు మారడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గణపవరం గ్రామంలో ఈ విషయంలో విజయం సాధించగలిగామని చెప్పారు. ఈ పరిధిలోని దాదాపు 100 గ్రూపులను ఇప్పటికే ఇతర బ్యాంకుల నుంచి గణపవరం సొసైటీ బ్యాంకుకు మార్చగలిగామని పేర్కొన్నారు. ఇది నిజంగా మానిమేటర్ల కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. సొసైటీల్లో డ్వాక్రా గ్రూపులకు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తారని చెప్పారు. మహిళలు ఎంత అడిగితే అంత రుణం మంజూరయ్యేలా తాను జీడీసీసీ బ్యాంకు చైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు వరంలాంటి పాలన అందుతోందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీని చేసి చూపుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా తొలి విడత నగదును గతేడాది మహిళామ తల్లులకు అందిందని చెప్పారు. రెండో విడత డబ్బులు కూడా రేపు గురువారం రోజున ఆడపడుచులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణాలపై ఏటా వడ్డీ కూడా జమ చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లకుపైగా వడ్డీని తమ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇలా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కూడా మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు సైతం మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇస్తున్న ఇళ్ల స్థలాలు, కడుతున్న ఇళ్లు అన్నీ మహిళల పేర్లతోనే ఉంటున్న విషయం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
మా ప్రభుత్వ హయాంలో రూ.20.23 కోట్ల నిధులు
గణపవరం సొసైటీ అధ్యక్షుడు కాట్రు రమేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సొసైటీ నుంచి రూ.20.23 కోట్లు అందజేసినట్లు తెలిపారు. తమ త్రిసభ్య కమిటీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,కొమరవల్లి పాడు సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు తులం సుధాకర్,పిల్లి సాగర్,ఆదం వలి నాయకులు కెల్లంపల్లి సుందరరావు, గాలి బుచ్చయ్య,బొప్పూడి రామారావు,బొంతా ప్రభుదాస్,మలిశెట్టి సుబ్బారావు,మండలనేని వెంకటేశ్వర్లు,ఆముదాలపల్లి అంజి,మరియు పలువురు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం కారుచోల గ్రామం వద్ద పిడుగుపాటు వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారుచోల పరిధిలోని పొలాల్లో మిర్చి పంటలు కలుపు తీస్తున్న ఇద్దరు మహిళలకు నాలుగడుగుల దూరంలో పిడుగు పడటంతో నందిగం రావమ్మ కవిత అనే అత్తా కోడలు గాయాల పాలయ్యారు.
పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు
06-10-2021 అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు రాకెట్ లాగా ఆకాశంలో దూసుకు వెళ్తుంటే దానికి తోడు తాజాగా వంట గ్యాస్ LPG పై 15 రూపాయలు పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై 25 రూపాయలు కమర్షియల్ 19 కేజీల సిలిండర్లపై 43 రూపాయలు పెంచారు. అయితే తాజాగా డొమెస్టిక్ సిలిండర్లపై 15 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపాయి. ఇటు పెట్రోల్ డీజిల్ పై 33 పైసలు పెంచుతున్నట్లు ఇంధన శాఖ తెలియజేశారు. పెరిగిన సిలిండర్ల ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ పెరిగే, పెట్రోల్ & డీజిల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వలన సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి
గంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు & రమాదేవి భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం పాపారావు చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈరోజు పాపారావు తీవ్ర అస్వస్థతకు గురిఅవ్వటంతో వెంటనే కూతురు అల్లుడు పాపారావును గుంటూరులోని హాస్పటల్కు తరలించారు. అప్పటికే పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె తండ్రి మరణ వార్తను తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెనూ స్థానిక హాస్పటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. తండ్రి చనిపోయిన రెండు గంటల్లో తల్లి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరయ్యారు.
*Advertisement*
చిలకలూరిపేట... పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు
మంగళవారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అర్బన్ సిఐ రాజేశ్వరరావు పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాత పశువుల సంత నుండి చౌత్ర సెంటర్ వరకు ఉన్న డబల్ రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉండే హోటళ్లు ఇతర దుకాణాలకు వచ్చేవారు వారి వాహనాలను ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా పార్క్ చేయటం వలన ట్రాఫిక్ సమస్య కలుగుతుందని అందువలన తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలి అని తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
పండరీపురంలో - 2
సుగాలి కాలనీలో - 1 గా నమోదు అయ్యాయి.
మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో ఉన్న నారాయణ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ టౌన్ సిఐ జి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా వారి మొబైల్స్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని , అలాగే దిశా యాప్ వలన జరిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే సమస్య వచ్చిన వెంటనే 100 నెంబర్కు కాల్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ఒకవేళ మహిళలు పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయాల్లో ఉండే మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని తెలిపారు.
చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...
చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవా సమర్పణ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసరావు,రూరల్ మండల మైనార్టీఅధ్యక్షులు పోతవరం సుభాని, ఉపాధ్యక్షులు మద్దిరాల సుభాని, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాత్రం సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ,పొత్తూరి బ్రహ్మానందం, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి జే రాయుడు తో పాటుగా అక్కడి స్కూలు టీచర్లు అందరూ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.
చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)
చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట - S.A.Nరాజు స్వగ్రామం కట్టమూరులో పార్థివ దేహాన్ని సందర్శించిన ప్రత్తిపాటి.తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకుడు S.A.N రాజు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. గుండెపోటు కారణంగా మృతి చెందిన రాజు మృతదేహాన్ని వారి స్వగృహం అయినా సత్తెనపల్లి మండలం కట్టమూరుకు తరలించడం జరిగింది. S.A.N రాజు మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు హుటాహుటిన కట్టమూరు బయలుదేరి వెళ్లి రాజు పార్థివదేహాన్ని సందర్శించడం జరిగింది. రాజు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, పార్టీలో ఎంతోకాలం నుండి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ, పార్టీలో ఎదుగుతున్న సమయంలో ఆకస్మికంగా మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాజు మృతి పార్టీకి పూడ్చ లేని లోటు అని, వ్యక్తిగతంగా తను మంచి సన్నిహితుడిని కోల్పోయానని తెలిపారు. రాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలియజేశారు. రాజు మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో మానం వెంకటేశ్వర్లు, నెల్లూరి సదాశివరావు, షేక్ కరిముల్లా, ఇనగంటిజగదీష్, నాతాని ఉమామహేశ్వర రావు, భీమవరపు సుబ్బారావు,పఠాన్ సమద్ ఖాన్, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజిమదన్మోహన్, ముద్దన నాగేశ్వరరావు,మద్దూరి వీరా రెడ్డి, షేక్ అబ్దుల్ ఖుమీర్, S.S.సుభాని, పావులూరి శ్రీనివాస రావు, గంగా శ్రీనివాస రావు, దగ్గుమల్లి సాంబశివరావు, అంబటిసోంబాబు, కొండా వీరయ్య, జరుగుమల్లి చెన్నయ్య, గేరా రాజశేఖర్, అందేలా శౌరి, మద్దుమాల రవి, పిల్లి కోటి, బొంతా వేణు, కేసానుపల్లి రమేష్, V. సుబ్బారావు, నూలు రాజేష్, గట్టుపల్లి మాణిక్యరావు, లెనిన్, ముకిరి వీరాoజనేయులు, రాజేష్, ఇనగంటి బెజిమాన్, గుర్రం నాగ పూర్ణ చంద్రరావు, ఆవుల గోపి, ఈవూరిబ్రహ్మానందo, G.V.H.S ప్రసాద్, మద్ది బోయిన శివ, జంగా వినాయకరావు, షేక్ ఖాజా మోహిద్దిన్, మురకొండ మల్లి బాబు, షేక్ అజారుద్దీన్, MBT వహబ్, కందుల రమణ, తూబాటి శ్రీహరి, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, అచ్చుకోల భాస్కర్ రావు, తొండపి వెంకయ్య,అరె మల్లికార్జున్ రావు, నామ్ పల్లి రమేష్, కుప్పాల శ్రీనివాస రావు,సీతారామిరెడ్డి, మారెళ్ళ అప్పారావు, మండవ వెంకట్రావు, యలమందల పోతురాజు, గుమ్మా ప్రసాద్, తిరుపతయ్య, షేక్ బాజీ, షేక్ రఫీ( మాజీ 14va ప్రెసిడెంట్ వార్డు), షేక్ భారీ సైదా, తన్నీరు పుల్లారావు, ఏలూరి నాగేశ్వర రావు, S.M.ఉమర్, పూర్ణసింగ్, A.మాదవ, నరవర్యబాలాజీ సింగ్, తాళ్లూరి భార్గవ్, షేక్ రఫీ, వేల్పూరి రమేష్, అమరా మణి, కొండా శ్రీను తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల జననం..
బ్రేకింగ్ న్యూస్ :- నాగ చైతన్య - సమంత విడాకులు
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య & సమంతల వైవాహిక బంధం గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. నాగ చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమంతతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇద్దరి అంగీకారం తోటే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కష్ట సమయంలో అభిమానులు తమకు మద్దతుగా ఉండాలని కోరారు.విడాకులు తీసుకున్న కూడా తమ మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం.
చిలకలూరిపేట పట్టణంలో రేపు శనివారం నాడు చికెన్, మటన్, చేపల మార్కెట్ లు మూసివేయాలి - మున్సిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలో రేపు అనగా 02 -10 -2021 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చికెన్,మటన్, చాపల మార్కెట్ తోపాటుగా బార్ అండ్ రెస్టారెంట్లు,నాన్ వెజ్ హోటల్స్ మూసి వేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు
చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు
...ధియేటర్ పేరు | సినిమా పేరు |
---|---|
సాయి కార్తికా స్క్రీన్ - 1 | |
సాయి కార్తికా స్క్రీన్ - 2 | |
భాస్కర్ సినిమాస్ | |
విజయ భాస్కర్ సినిమాస్ | |
K R మినీ సినిమాస్ | |
కృష్ణమహల్ థియేటర్స్ | |
రామకృష్ణ థియేటర్స్ | |
వేంకటేశ్వర థియేటర్స్ | |
శ్రీనివాసా థియేటర్స్ | |
విజయలక్ష్మి థియేటర్స్ |
కూరగాయల రకాలు | తూకం | ధరలు |
---|---|---|
టమాటా | 1 kg | 30 |
పచ్చి మిర్చి | 1Kg | 50 |
వంకాయలు | 1Kg | 40 |
బెండకాయలు | 1Kg | 40 |
బంగాళాదుంపలు | 1Kg | 40 |
దొండకాయలు | 1Kg | 40 |
మున్నక్కాయలు | 1 Kg | 80 |
దోసకాయలు | 1Kg | 40 |
క్యాబేజి | 1Kg | 40 |
క్యాలీఫ్లవర్ | 1Kg | 50 |
చిక్కుడుకాయలు | 1Kg | 120 |
గోరు చీకుళ్ళు | 1Kg | 60 |
బీన్స్ | 1Kg | 80 |
క్యారెట్ | 1Kg | 100 |
బీట్రూట్ | 1Kg | 80 |
కాకరకాయలు | 1Kg | 60 |
ఉల్లిపాయలు | 1Kg | 40 |
చిన్నుల్లిపాయాలు | 1Kg | 100 |
తోటకూర | 1 కట్ట | 7 |
పాలకూర, | 1 కట్ట | 7 |
చుక్కకూర | 1 కట్ట | 7 |
మెంతుకూర | 1 కట్ట | 7 |
గోంగూర | 1 కట్ట | 7 |
కొత్తిమీర | 1 కట్ట | 50 |
కర్వేపాకు | 1Kg | 40 |