భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి
గంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు & రమాదేవి భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం పాపారావు చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈరోజు పాపారావు తీవ్ర అస్వస్థతకు గురిఅవ్వటంతో వెంటనే కూతురు అల్లుడు పాపారావును గుంటూరులోని హాస్పటల్కు తరలించారు. అప్పటికే పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె తండ్రి మరణ వార్తను తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెనూ స్థానిక హాస్పటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. తండ్రి చనిపోయిన రెండు గంటల్లో తల్లి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరయ్యారు.
*Advertisement*
No comments:
Post a Comment