మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏకంగా 50 గ్రూపులకు రూ.5 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపవరం సొసైటీ బ్యాంకు పరిధిలో గణపవరం, అప్పాపురం, కనపర్తి, ఇర్లపాడు, ఆవిశాయపాలెం గ్రామాలు ఉన్నాయని, ఈ ఐదు గ్రామాల్లో కలిపి మొత్తం 563 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిచే జీడీసీసీబీలోనే వీరంతా రుణాలు పొందాలనే గొప్ప సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాలకు అత్యల్ప వడ్డీ కేవలం 9 శాతం వసూలు చేసేది ఒక్క జీడీసీసీ బ్యాంకు మాత్రమేనని, ఇతర బ్యాంకులు 11, 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని వివరించారు. అందుకే డ్వాక్రా గ్రూపులు సొసైటీ బ్యాంకులకు మారడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గణపవరం గ్రామంలో ఈ విషయంలో విజయం సాధించగలిగామని చెప్పారు. ఈ పరిధిలోని దాదాపు 100 గ్రూపులను ఇప్పటికే ఇతర బ్యాంకుల నుంచి గణపవరం సొసైటీ బ్యాంకుకు మార్చగలిగామని పేర్కొన్నారు. ఇది నిజంగా మానిమేటర్ల కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. సొసైటీల్లో డ్వాక్రా గ్రూపులకు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తారని చెప్పారు. మహిళలు ఎంత అడిగితే అంత రుణం మంజూరయ్యేలా తాను జీడీసీసీ బ్యాంకు చైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు వరంలాంటి పాలన అందుతోందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీని చేసి చూపుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా తొలి విడత నగదును గతేడాది మహిళామ తల్లులకు అందిందని చెప్పారు. రెండో విడత డబ్బులు కూడా రేపు గురువారం రోజున ఆడపడుచులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణాలపై ఏటా వడ్డీ కూడా జమ చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లకుపైగా వడ్డీని తమ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇలా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కూడా మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు సైతం మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇస్తున్న ఇళ్ల స్థలాలు, కడుతున్న ఇళ్లు అన్నీ మహిళల పేర్లతోనే ఉంటున్న విషయం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
మా ప్రభుత్వ హయాంలో రూ.20.23 కోట్ల నిధులు
గణపవరం సొసైటీ అధ్యక్షుడు కాట్రు రమేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సొసైటీ నుంచి రూ.20.23 కోట్లు అందజేసినట్లు తెలిపారు. తమ త్రిసభ్య కమిటీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,కొమరవల్లి పాడు సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు తులం సుధాకర్,పిల్లి సాగర్,ఆదం వలి నాయకులు కెల్లంపల్లి సుందరరావు, గాలి బుచ్చయ్య,బొప్పూడి రామారావు,బొంతా ప్రభుదాస్,మలిశెట్టి సుబ్బారావు,మండలనేని వెంకటేశ్వర్లు,ఆముదాలపల్లి అంజి,మరియు పలువురు పాల్గొన్నారు.
No comments:
Post a Comment