మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో ఉన్న నారాయణ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ టౌన్ సిఐ జి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా వారి మొబైల్స్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని , అలాగే దిశా యాప్ వలన జరిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే సమస్య వచ్చిన వెంటనే 100 నెంబర్కు కాల్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ఒకవేళ మహిళలు పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయాల్లో ఉండే మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని తెలిపారు.
No comments:
Post a Comment