మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా బాధితులకు అత్యవసర ఇంజక్షన్ గా పేరు పొందిన రెమిడీసీవర్ ఇంజక్షన్ తయారీకి మన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొల్లపూడి గ్రామము నందు ఉన్నసేఫ్ పేరేంటరల్స్ లిమిటెడ్ నందు MP శ్రీకృష్ణదేవరాయల లేఖ మేరకు అనుమతులు లభించాయి. అయితే 5లక్షల ఇంజక్షన్ తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే అంబట్టి రాంబాబుగారు, MP శ్రీకృష్ణదేవరాయలుగారు ఆయా ప్రాంతాన్ని సందర్శించి ఇంజక్షన్ తయారీ, ఇతర అంశాలపైనా చర్చించారు. 





















Share:

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా హాస్పిటల్ సదుపాయాలకు అందరూ సహకరించటం చాలా ఆనందకరమైన విషయం అని, ప్రైవేట్ వైద్య శాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ప్రభుత్వ  వైద్యం అందుతుంది అని, MP, MLA పిలుపు మేరకు ధాతల అందించిన సహకారం శుభపరిణామం అని తెలిపారు. అలాగే మౌళిక సదుపాయాలు, 4 లక్షల విలువైన మందులను అందించిన నాయుడు రమేష్ గారికి, ఆక్సిజన్ సిలిండర్ అందించిన బైరా కుటుంబ సభ్యులకు, 4 లక్షల విలువైన మాస్కలు, శానిటైజెర్లు ఇతర  వైద్య సదుపాయాలకు అవసరం అయిన వాటిని అందించిన అసిస్ట్ సంస్థకు ప్రత్యేకమైన  ధన్యవాదాలు తెలిపారు. అలాగే MLA గారి పర్యటించి ఇక్కడ రోగులకు ఉచిత భోజన సదుపాయాన్నిఎర్పాటు చేస్తాం అని చెప్పటం చాల ఆనందంగా ఉంది అని,  అలాగే డాక్టర్ భవాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ పని చేసే స్టాఫ్ డాక్టర్స్, నర్సులు, సిబ్బందికి  అభినందించారు. 
 
హాస్పిటల్ నందు శానిటైజ్ సిబ్బందిని ఎర్పాటు చెయ్యాలి అని, అలాగే RK హాస్పిటల్ నందు ఆక్సిజన్ వార్డులో పని చేసే సిబ్బందిని అక్కడ కరోనా ట్రీట్మెంట్ అనుమతులు నిలిచిపోవటం వలన వారిని ఎక్కడికి తీసుకువచ్చి ఆక్సిజన్ సప్లై ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని, పట్టణం నుండి NH 16 జాతీయ రహదారి కారణంగా ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తుంటాయి కావున ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో  శవాగారం ఎర్పాటు చేస్తున్నారు. కానీ అత్యవసరం కొరకు కొన్ని ఐస్ బాక్ససులు ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ నాయకులూ పాల్గొన్నారు 

డాక్టర్ భావాని గారు మాట్లాడుతూ మేము డాక్టర్ వృత్తిని ఎన్నికొని ఇక్కడ పని చెయ్యటం అందరికి సేవ చెయ్యటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం అని, సిబ్బంది కరోనా లెక్క చెయ్యకుండా వారికీ సేవలు అందిస్తున్నరు అని తెలిపారు 


























Share:

కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న

కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు పాల్గొన్నారు. నిన్న బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించి అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా ఓపీ, నాన్ కరోనా ఓపీ ఒకచోట ఉండటం అసహనానికి గురి అయ్యారు. వెంటనే రెండు వేరు వేరు ఓపీ విభాగాలని ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. అలాగే కొన్ని వార్డులలో పర్యటించి మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని అందించాలి అని తెలిపారు. 
ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో MLA గారి పిలుపు మేరకు ఉచిత కరోనా మృతిదేహాల తరలింపుకు వాహనాని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు 100 పడకలుగా నిర్మాణాన్ని పరిశీలించారు అని.అలాగే కరోనా రోగులకు ఎ సమస్య వచ్చిన తమకు కాల్ చెయ్యవచు అని తెలిపారు. 
మున్సిపల్ చై ర్మెన్ రఫాని గారు :- 9440479765
మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు :-9553129726































Share:

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు. 
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు. 
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న కరోనా కోరంటైన్ నందు పట్టణములోని భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఫ్రూట్స్ అందించారు ట్రస్ట్ సభ్యులు. కోరంటైన్ నందు భోజన సదుపాయాలు , మంచినీటి వసతి ఉన్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఫ్రూట్స్ అందజేశారు. మందులతో పటు నాచురల్ ఫ్రూట్స్ వలన కలిగే లాభాలని తెలియజేసి వాటిని కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడాల భాస్కర్ , కందుల రవి, వంశీ, సాయి మురారి, నాయుడు ఫణి, కీర్తి సాయి, గుడిపల్లి యశ్వంత్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తారీఖున పలువురు బ్యాంకు సిబ్బంది కరోనా రావటంతో 3వ తరుకు నుండి బ్యాంకు మూసివేశారు . అప్పటినుండి మధ్యలో 1,2 రోజులు ఓపెన్ చేసినా బ్యాంకు పనుల నిమిత్తం ఖాతా దారులకు అనుమతి లేకుండా బ్యాంకు పనులు చూసుకొని మళ్లీ మూసివేశారు. ఇప్పటికే 15 రోజుల అవుతున్న కారణంగా వ్యాపారలావాదేవీలు కోసం వ్యాపారస్తులు, అత్యవసర లావాదేవీలు జరపటానికి బ్యాంకు మూసి ఉండటంతో బ్యాంకు ఖాతా దారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్యాంకు ఓపెన్ చేసి అత్యవసర లావాదేవీలకు అనుమతించాలి అని కోరుతున్నారు 










































Share:

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని భగవత్ గీతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సేఫ్టీ కొరకు ప్రత్యేకంగా తాయారు చేయించిన పొడిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ (మునిసిపాలిటీ ఆఫీస్, పోలీస్టేషన్, హాస్పిటల్స్ ) ఆఫీసు నందు అందజేశారు. ఈ పౌడర్ని ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతో( జాజికాయ, జాపత్రి జాజిపువ్వు, అనాసపువ్వు, యాలుకాయలు, లవంగాలు, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ) తాయారు చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు గుడిపల్లి నాగభూషణం గారు  వీటి వలన కరోనా బాక్టీరియా గాలిలో విస్తరించకుండా కొంత వరకు కాపాడుతుంది అని తెలిపారు.కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా తాయారు చేయించారు అని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వీటిని  మునిసిపల్ చైర్మన్ రఫ్ఫాని గారికి, అర్బన్ CI బిలాలుద్దీన్ గారికి, రూరల్ CI సుబ్బారావు గారికి, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో వడాల భాస్కర్, కందుల రవికుమార్, నాయుడు ఫణి, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.   

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/







































Share:

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు. 
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు.  హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన  మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. 
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం.  యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.  



























Share:

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రేపు శనివారం కారణంగా విధ్యుత్ మరమ్మతులు కోసం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో కరంటు కోత విధిస్తున్నట్లు డి ఈ ఈ సీహెచ్ రంబొట్ట్లు గారు తెలిపారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ నుండి విజయ బ్యాంకు వరకు స్టేట్ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంకు , హనుమాయమ్మ సత్రం,గాంధీపేట,హైస్కూల్ రోడ్డు, మునిసిపల్ ఆఫీస్ రోడ్డు, కొత్త పోలీస్టేషన్ రోడ్డు, డిక్మెన్ నగర్  ఉదయం 8:30 నుండి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అని తెలిపారు . 






































Share:

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ నందు ప్రతి సంవత్సరం ఎర్పాటు చేసే సామూహిక ప్రార్ధనలూ కరోనా కారణంగా ఈసారి నిర్వహించలేక రోడ్లు అన్ని బోసిపోయాయి. అయినా పట్టణంలో రంజాన్ వేడుకలు కరోనా ప్రొటొకాల్ పాటిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు చేసుకొని మత పెద్దల సహకారంతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అలాగే మసీదులకు రాని వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకుంటున్నారు. దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా గా ఉండాలి అని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కట్టడికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలి అని తెలిపారు మత పెద్దలు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ , శానిటైజేర్ వాడాలి అని తెలిపారు. 





























 

Share:

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. 
 
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ  కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.  


https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.