మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం 

మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

పలనాడు జిల్లా :- ఎప్పుడు ఎప్పుడు పార్టీలో చేరుతారా అని నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు లావు శ్రీకృష్ణ TDP లో చేరిక తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన గురజాల నియోజకవర్గం, దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.  సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

- లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం

Share:

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

చిలకలూరిపేట:-  మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని టిడిపి శ్రేణులు సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ తగలబెట్టి నరసరావుపేట సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు.

నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని.. కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మమ్ములను వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి.. అందుకే ఇటువంటి చేష్టకు నీవు పూనుకుంటున్నావు అంటూ ఆయన ద్వజమెత్తారు.

ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు..

పత్తిపాటి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేశారు. బైపాస్ పై నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సీఎం, నశించాలి నిరంకుశ పాలన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపీ -  జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?


చిలకలూరిపేట మంత్రి పార్టీ తనయుడు ప్రత్తిపాటి శరత్ ను బ్రెస్ట్ చేశారు వివరలోకి వెళితే ... GST పన్ను ఎగవేత కేసులో కృష్ణాజిల్లా విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి కంపెనీలలో షేర్ హోల్డర్ గా లేని తన తనయుడిని అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేపించారని ప్రత్తిపాటి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందుకున్న టిడిపి శ్రేణులు భారీ ఎత్తున ప్రత్తిపాటి నివాసానికి చేరుకుని అరెస్టుని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించారు.

Share:

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో  అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -

1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం

2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి

3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు

4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా

5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత

6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్

7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్

8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు

9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు

10)బాపట్ల : శ్రీ షేక్ కరీం

11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు

12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్

13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు

14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి

15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్


*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*

1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్

2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు

3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి

4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ  

5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత

6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం

7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు

8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్

9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ

10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు

11)   అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి

12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు

13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు

14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్

15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం


Share:

చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

 చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.


శ్రీచైతన్య పాఠశాల నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


 శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు

ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.


నారాయణ స్కూల్ నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Share:

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

చిలకలూరిపేట:- పట్టణంలోని టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టుమిషన్ సృష్టికర్త అయిన స్త్రీ ఇలియన్స్ హోవే గారి చిత్రపటానికి పూలమల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ ప్రతినెల 20 వేల రూపాయలు టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్క తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం టైలర్  అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి జాన్ సైదా గారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు , పోతవరం సర్పంచ్ భాషా మేస్త్రి, కరీముల్లా, ఆది బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడవల్లి గ్రామ సర్పంచ్ తిరుమలేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఏడవల్లి గ్రామ సర్పంచ్ గా చేసిన మహిళా కుమారుడు గ్రామంలో మూడు ఆర్చీలు నిర్మించారని వాటి వలన కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లడానికి అడ్డంగా ఉందని పలుసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదని ఆమె తెలిపారు. ఊరిలో కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, కాపుల స్మశాన వాటికను పూర్తిగా ఆక్రమించుకున్నారని... ఏంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లారని ఎమ్మార్వో ని కలిస్తే ఆమె కూడా వారికే వత్తాసు పలికారని తిరుమలేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న పోరంబోకు స్థలాలు మొత్తాన్ని ఆక్రమించుకున్నారని చివరకు వాగులను స్మశానవాటికలను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. గ్రామంలో కాపులకు, కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, స్మశాన వాటికలో ఆక్రమాలు తొలగించాలని పలుమార్లు ఎమ్మార్వో చుట్టూ తిరిగిన ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని చివరిగా ఆమె ట్రాన్స్ఫర్ వెళ్లిపోయిందని  ఆవేదనను తెలియజేశారు.

Share:

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ


చిలకలూరిపేట:- బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చలంచర్ల నాగమ్మ(55) అనే మహిళ రెండు సంవత్సరాలుగా సొలస గ్రామం ఎస్టి కాలనీలో నివాసం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు ఒంటరిగా జీవిస్తున్న ఆమె పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని వారు తెలిపారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని బావి నుండి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share:

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను  - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు




పల్నాడు జిల్లా :- గత కొంతకాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి టిడిపిలో చేరడం ఖరారు అయినా కూడా తేదీని ప్రకటించకపోవడంపై సందిగ్ధత నెలకొన్నది. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బిజెపికి ఇస్తారనే ప్రచారంతో అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వం వస్తుందో అనే ప్రచారానికి తెరపడింది. ఎంపీ ఆఫీస్ నుండి అఫీషియల్ గా త్వరలో జరగబోయే పలనాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి మరియు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ పలనాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను అని ఆ ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

Share:

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే :-


టీడీపీ అభ్యర్థులు :-

ఆముదాలవసల - కూన రవికుమార్

ఇచ్చాపురం - బెందాళం అశోక్

టెక్కలి - అచ్చెన్నాయుడు

రాజాం - కొండ్రు మురళీమోహన్

అరకు - దొన్ను దొర

కురుపాం - జగదీశ్వరి

పార్వతీపురం - విజయ్ బొనెల

సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి - బేబీ నాయన

గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - పూసపాటి అదితి

నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

పాయకరావుపేట - వంగలపూడి అనిత

విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ - గణబాబు

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

పి గన్నవరం - మహాసేన రాజేష్

కొత్తపేట - బండారు సత్యానందరావు

మండపేట - జోగేశ్వరరావు

రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం - చినరాజప్ప

తుని - యనమల దివ్య

అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

చింతలపూడి - సొంగా రోషన్ కుమార్

తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు

నూజివీడు - కొలుసు పార్థసారథి

ఏలూరు - బడేటి రాధాకృష్ణ

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన - కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

పామర్రు - కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్

జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య

నూజివీడు - కొలుసు పార్థసారథి

నందిగామ - తంగిరాల సౌమ్య

తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి - నారా లోకేష్

పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్

బాపట్ల - నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ - జీవీ ఆంజనేయులు

మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

రేపల్లె - అనగాని సత్యప్రసాద్

ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్

ఒంగోలు - దామచర్ల జనార్థనరావు

కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి

కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

కావలి - కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు - పాశం సునీల్ కుమార్

సూళ్లూరు పేట - విజయ శ్రీ

ఉదయగిరి - కాకర్ల సురేష్

కడప - మాధవి రెడ్డి

రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల - బీటెక్ రవి

మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి

శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు - టీజీ భరత్

పాణ్యం - గౌరు చరితా రెడ్డి

నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్

బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ - కేఈ శ్యాంబాబు

కొడుమూరు - దస్తగిరి

రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పయ్యావుల కేశవ్

తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు - పరిటాల సునీత

మడకశిర - సునీల్ కుమార్

హిందూపురం - నందమూరి బాలకృష్ణ

పెనుకొండ - సవితమ్మ

తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి

పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు - బీఎం థామస్

చిత్తూరు - గురజాల జగన్‌మోహన్

పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు


జనసేన అభ్యర్థులు :-

నెల్లిమర్ల- లోకం మాధవి

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్ - పంతం నానాజీ

తెనాలి-నాదెండ్ల మనోహర్

రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

Share:

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

గత కొంత కాలంగా బిజెపి పొత్తు విషయమై జాప్యం చేస్తున్న నేపథ్యంలో జనసేన - టిడిపి అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఈరోజు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి పేరును పత్తిపాటి పుల్లారావు గా ప్రకటిస్తూ భిన్నాభిప్రాయాలకు తెరదించారు. స్థానికంగా చిలకలూరిపేటలో భారీగా పట్టు ఉన్న ప్రత్తిపాటికే చిలకలూరిపేట టిడిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గత కొంతకాలంగా జనసేన - తోటరాజ రమేష్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ప్రత్తిపాటిని ఎంపిక చేసినందుకుగాను టిడిపి కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Share:

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి నందిత సికింద్రాబాద్ నుండి బాసరకు వెళ్తున్న సమయంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ను ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా చర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి హోం గార్డెన్ ఢీకొనడంతో అతను అక్కడక్కడ మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు పది రోజుల సమయంలో ఈ యాక్సిడెంట్ లో చనిపోవడంతో నియోజకవర్గం ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 19 న లాస్య తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య మృతి పట్ల పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

Share:

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

చిలకలూరిపేట :- త్వరలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం రానున్నటంతో చిలకలూరిపేట లోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంవత్సరకాలం మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఆర్థిక స్తోమత వలన ఫీజులు కట్టకపోతే వారికి హాల్ టికెట్లు నిలిపివేయకుండా విద్యార్థులకు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్థికపరమైన చిక్కుల వలన వెనక్కి వెళ్ళకూడదు అని, అలాగే ప్రభుత్వం తల్లి ఖాతాలో కాకుండా విద్యార్థుల పాఠశాలల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలని దీని ద్వారా విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా విద్యా దీవెన సక్రమంగా స్కూళ్లకు మరియు కాలేజీలకు చేరుతుందని వారు కోరారు. ఇలా చేయడం వలన హాల్ టికెట్లు, విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని వారు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలలో, స్కూల్లలో హాల్ టికెట్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపోతుల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి నాయక్, బొంత భగత్ సింగ్, సహాయ కార్యదర్శి పృద్వి, త్రిపురం సురేంద్ర మరియు మండాది ఫణి పాల్గొన్నారు.

వేగంగా వార్తలను పొందటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట:- మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ కనెక్షన్ కోసం చిలకలూరిపేట రూలర్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు 55,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన ACB అధికారులు లంచం తీసుకుంటుండగా ప్రకాష్ రావు నాయక్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మత్తె, డీఎస్పీ సత్యానంద్ రైడ్ లో పాల్గొన్నారు. లంచాలకు పాడుపడుతున్న అధికారుల సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు తెలిపారు.


మరిన్ని వార్తలు వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి వాట్స్అప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/GJSIoeRYDkBLAgjWVh6RlO

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.