మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ కళాకారుడు గుండెపోటుతో మృతి

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ  కళాకారుడు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న( వేణుగోపాల్) 37 గుండెపోటుతో మృతి చెందారు వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న అనే నృత్య కళాకారుడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మవారి వేషధారణలో కనిపిస్తూ భక్తి రసాన్ని రక్తి కట్టించేవాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో మరియు పలు టీవీ కార్యక్రమాలలో కూడా తన నాట్యంతో మెప్పించేవాడు. అయితే గత రాత్రి పెదనందిపాడు రోడ్డు, మారుతి నగర్ లోని జ్వాలాముఖి పోలేరమ్మ మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అతను డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు సిపిఆర్ చేసినట్లయితే బ్రతికి అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సుబ్బయ్య తోటలోని సొంత గృహం నందు విషాదఛాయలు అలముకున్నాయి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు, రేపు కొండవీడు ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

నేడు, రేపు కొండవీడు  ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

 పల్నాడు జిల్లాలో చారిత్రక,సాంస్కృతిక పరంగా, పర్యాటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అమరావతి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు చాలావరకు పర్యాటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని, మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. పర్యాటక పరంగా అమరావతి, కొండవీడు కోట, కోటప్పకొండ, నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పులిచింతల, దైద, గుత్తికొండ బిలం, చేజర్ల, దుర్గి శిల్పకళ, మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం, వెన్న ముద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ (చంఘిజ్ ఖాన్ పేట) ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నిలయం పల్నాడు జిల్లాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని, కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే, ఆ తరహా పర్యాటక అభివృద్ధికి, బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేసామన్నారు, ఆ ప్రాంతమంతా (రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతం కావడంతో వారి సహకారంతో సుమారు రూ 4 కోట్లు ఖర్చు చేసి అక్కడ కొన్ని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని గుర్తు చేసుకుంటూ "కొండవీటి ఫెస్ట్ - 2024" ఉత్సవాల సందర్భంగా కొండవీడు కోటను సందర్శిస్తే బాగుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కోసం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లో అడ్వెంచర్ లాగా చేస్తే ఆ జ్ఞాపకాలతో కొండవీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు వెళ్లి ఇంకొంత మంది పర్యాటకులతో చెప్పి తీసుకువచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రిక్కింగ్, రాక్ లైనింగ్, షూటింగ్, ఆర్చరీ, విధుల చెరువును చాలా క్లిష్టతరమైన పని పూర్తి చేసి బోటింగ్, కయా కింగ్, ఫిషింగ్, హార్సింగ్ ఏర్పాటు చేశాం, ఇది ఎప్పుడు అలానే ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది, అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ఒక టైం లో "నైట్ క్యాంప్" అక్కడే ఒక టెంట్ ను మరియు భోజన వసతులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ( జంతు రక్షిత  ప్రాంతం) కనుక ఎటువంటి ప్రాణహాని లేకుండా జాగ్రత్తగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొండవీటి ప్రాంతాన్ని ఒక జాతరలా (ఫెస్టివల్ తరహాలో) జరిగేలా ప్రీ ప్లాన్ గా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటించారు, పల్నాడు జిల్లాతో పాటు పక్క జిల్లాలైన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి 10,11 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పిబ్రవరి 10,11 తేదీల్లో కొండవీడు కోట-2024 ఫెస్ట్ ను చేయ బోతున్నట్లు పైన చెప్పినవన్నీ పర్మినెంట్ యాక్టివిస్ అని, ఇవి కాక  హెలీ రైడ్, పారా రైడ్, హార్స్ రైడ్ లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు, ఇందులో హెలీ రైడ్ కు 4 వేలు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు, పారా రైడ్ కు 2వేలు, హార్స్ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ను ఏర్పాటు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా పిల్లల కోసం తెప్పిస్తున్నామన్నారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్ గీసేలా ఏర్పాటు చేస్తామాన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాములు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి అందులో క్లాసికల్, వెస్ట్రన్ పోటీలను పెట్టడం జరుగుతుందన్నారు, ఇందులో ఎంపిక కమిటీ (జడ్జెస్)ఉంటుందన్నారు.వీటిలో ప్రధమ రూ. 10,116, ద్వితీయ రూ. 5,116,తృతీయ  బహుమతులు రూ.2.500లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండవీడు కోట-2024 లో ఉత్సాహంగా పాల్గొనే వారికి అన్ని వసతులను కల్పిస్తున్నట్లు, క్రీడలతోపాటు, ఆహ్లాదకరమైన, సహస కృత్యాలు, ఆటలు, ఫుడ్డు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చినా, వారి మదిలో గుర్తుండి పోయేలా "కొండవీడు “ఫెస్ట్-2024" తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరిపేట:- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలందరూ పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ... వైకాపా అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ఆ వర్గాలు మళ్లీ జగన్‌కు ఓటేయాలని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్‌ వర్గాలంటే వారి వెన్ను విరిచినందుకా... 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా... 74మంది బీసీలు నాయకుల్ని క్రూరంగా నరికి చంపినందుకా...  5వేల మందిబీసీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినందుకా... వాళ్లే వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పగలరా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం ప్రభుత్వ హయంతో ఆత్మగౌరవంతో, అన్నింటా అవకాశాలతో తలెత్తుకుని బతికిన వెనకబడిన వర్గాల వారిని అన్ని విధాలుగా మోసం చేసి రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన దుయ్య బట్టారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 1983 తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు తెదేపా రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు . అలాంటి పరిస్థితుల నుంచి గడిచిన అయిదేళ్లలో 56 బీసీ కార్పొరేషన్లు అంటూ ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా వాటికి పైసా విదల్చక పోగా బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన దాదాపు రూ. 75 కోట్లు దారి మళ్లించడం వారి కుటిలనీతికి నిదర్శమన్నారు. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా జగన్ అత్యధికంగా అన్యాయం చేస్తోంది బీసీలకే అని తెలిపారు ప్రత్తిపాటి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈసారి తమ రాజకీయ అవకాశాల పుట్టినిల్లు తెలుగుదేశంతో కలసి నడవాలని కృతనిశ్చయంతో ఉన్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొగిలి సత్యనారాయణ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక మనస్థాపనతో గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం గా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్ సభ్యులు, మాజీ టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

చిలకలూరిపేట:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్రలో భాగంగా... నేడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామానికి చేరుకోనున్నారు. చంద్రబాబు అరెస్టుపై మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఎడ్లపాడు ఎస్టి కాలనీకి చెందిన మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి నేడు చిలకలూరిపేట నియోజకవర్గం చేరుకోనున్నారు.

మరిన్ని వివరాలకై క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వైసీపీ నేత జాలాది సుబ్బారావు మాట్లాడుతూ... చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజిని అండ చూసుకొని వారి మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగు పక్కన ఉన్న గొర్రెల సంత వద్ద చిలకలూరిపేట టు పసుమర్తి రోడ్డు మధ్యలో అడ్డంగా గోడ కట్టడం వలన తారు రోడ్డు సాంక్షన్ అయినా కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇంతవరకు చేపట్ట లేదంటే దానికి కారణం రోడ్డుకి మధ్యలో అడ్డంగా గోడ కట్టడం. దాని వలన రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయని, గోడను తొలగించాలంటే కోటి రూపాయలు ఇస్తే కానీ గోడను తొలగించమని విడుదల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసినట్లు జాలాది సుబ్బారావు తెలిపారు. ఈ విషయం మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించామని సరైన స్పందన లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని ఆయన తెలిపారు. పసుమర్తి టు చిలకలూరిపేట రోడ్డు వేస్తే రవాణా సౌకర్యానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్:- కేజీబీ అనగానే అదెక్కడుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు. కేజీబీ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటే కాకినాడ తీరంలోని సముద్ర జలాలలో ONGC నిర్వహించిన పరిశోధనలో మన బంగాళాఖాతంలో భారీ ఎత్తున చమురు నిల్వలు సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు 35 వేల నుంచి 45 వేల బేర్ల చమురుని మనం ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ మరియు ఆయన ద్వారా వచ్చే లాభాలలో 50% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలని. మన వాటా మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సహజ సంపద - ప్రజల హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల గురించి వివరించుతూ ... ఏ రాష్ట్రం నుంచి అయినా సహజ సంపద వలన లాభాలు వస్తాయో ఆ లాభాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 50% లాభాలను ఇవ్వాలని యాక్ట్ ఉన్నా కూడా మన రాష్ట్రానికి మన వాటా వినటం లేదని వారు తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నాయకులు వలన లాభాలను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలని నాయకులు తీర్మానించుకున్నారు. ఈ లాభాలను మనం పొందగలిగితే రాష్ట్ర అప్పుల భారం ఎంతో కొంత తీరుతుందని దీని ద్వారా వంద రూపాయలకే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేయవచ్చు అని దీని పెట్టి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు.

Share:

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

చిలకలూరిపేట :- వివిధ అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 5,05,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను రాజశేఖర్ ఆఫీస్ నందు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు,  తెలుపుతూ తమకు సహకరించిన రాజశేఖర్ గారికి రుణపడి ఉంటాము అని వారు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

 చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట :- పట్టణంలోని సుబ్బయ్య తోట మస్తాన్ వలి దర్గా వద్ద 52వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దేవరకొండ పుల్లారావుతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య తోట యూత్ మరియు సుబ్బయ్య తోట టిడిపి కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.