మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి జెఎసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు సిద్దు , జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక ఎన్ ఆర్ టీ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం అన్యాయమన్నారు. పోలీసుల లాఠీఛార్జి కి వ్యతిరేకంగా నవంబర్ 15వ తేదీన చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్,బి.సాయి,  ఎం.ఫణి, కిరణ్ ,వి.మణి , యం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట బెంగళూరు నుండి విజయవాడ కు వెళుతున్న లారీలో ఉన్న క్లీనర్ ఫిట్స్ రావడంతో లారీ లో నుంచి క్రిందపడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. ఎస్ ఆర్ ఎమ్ టి పార్సిల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుండి బెంగళూరు కు సరుకు దించి రిటర్న్ వస్తుండగా... చిలకలూరిపేట గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు బ్రిడ్జి పైన గుంటూరుకు చెందిన క్లీనర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి మరణించినట్టుగా డ్రైవర్ రవి బాబు తెలిపారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీస్ వారు దర్యాప్తు చేపట్టారు.



Share:

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ లో ఏర్పాటుచేసిన మహిళ బాలికల రక్షణ మరియు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అందులో భాగంగా టౌన్ సీఐ రాజేశ్వరరావు మహిళల చదువు వారి యొక్క ఒక అభివృద్ధి అపోహల పై మాట్లాడుతూ సమాజంలో మహిళల చదువు ఎంతో ఉపయోగకరమని, మహిళలు చదువుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి... అన్నా అపోహల నుండి బయటకి రావాలని, తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ సొంత ఊరికి దూరంగా ఉండి విధులను నిర్వహిస్తున్నామని, కానీ మహిళలు చదువుకోవడం వలన స్థానికంగానే అనేక ఉద్యోగ సదుపాయాలు ఉన్నాయని. ఉదాహరణకు ఏఎన్ఎంలు ,వాలంటీర్లను చూపిస్తూ కష్టపడి చదవడం వలన సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారని, అలాగే స్త్రీలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు లక్ష నుండి మూడు లక్షల వరకు జీతం సంపాదిస్తున్నారని, గుర్తు చేశారు. టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు తన వంతు సహాయంగా కృషి చేస్తానని. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అలాగే దిశ చట్టంపై అవగాహన కలిగించారు. మహిళలు అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని స్త్రీ ఒక శక్తిగా ఉండాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు - సభ్యుల వివరాలు ఇవే

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు  - సభ్యుల వివరాలు ఇవే

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులు వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం పట్టణంలోని విద్యార్థులు అందరూ కలిసి 10/11/2021 న‌ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) (నాన్ పొలిటికల్) ఏర్పాటు చేసుకున్నారు. ఈ అందులో భాగంగా విద్యార్థులకు వారి యొక్క హక్కులను తెలియజేస్తూ - హక్కులకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని వాటిపై న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ జేఏసీ కమిటీ ఏ పార్టీలకు సంబంధం లేదని విద్యార్థుల హక్కులను పరిరక్షించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ జేఏసీ విద్యార్థులందరికీ భవిష్యత్తుకు ఉపయోగపడేది లాగా పనిచేయాలని అని వారు తీర్మానించుకున్నారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్ గా సి ఆర్ కాలేజీ కి సంబంధించిన విద్యార్థి యు.సిద్దు, వైస్ ప్రెసిడెంట్ గా రోహిణి డిగ్రీ కళాశాల కు సంబంధించిన విద్యార్థి మేకపోతుల. నాగేశ్వరరావు, ఎం. సాయి తేజ, సెక్రెటరీగా గుడిపల్లి. జగదీష్, జాయింట్ సెక్రటరీగా మాదాసు. పృథ్వీరాజ్, ఎ. త్రినాధ్, ట్రెజరీ గా మండాది ఫణి, నెంబర్లుగా భగత్ సింగ్, పి. మహేష్, మురారి (DRNS), మస్తాన్ వలీ, ఆలీ బాబు గా తన 13 మంది సభ్యుల తో జేఏసీ ని ఏర్పాటు చేశారు.



Share:

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు 11వ రోజు కి చేరింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా చదలవాడ ఊర్లో రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా. పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక రైతుల పై కూడా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడు గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి గాయాలయ్యాయి. రైతులను పాదయాత్ర చేయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘటన లోని రైతు మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి వేలాదిమంది ప్రజలు రైతులు మద్దతు తెలుపుతున్నారని. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ ఉండే మాపై లాఠీ ఛార్జ్ చేయడం సముచితం కాదని వారు తెలిపారు.



Share:

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈనెల 8 వ తారీఖున పండరీపురం 8 వ లైను నందు అంబటిపూడి శారద అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా .. అది గమనించిన చైన్ స్నచర్ వెనకనుండి వచ్చి అమాంతం ఆమె మెడలోని మూడు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే టౌన్ పోలీస్ శాఖకు విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దుండగుడు పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్రబాబు గా గుర్తించారు. పోలీసు విచారణలో తాను పెయింట్ వర్క్ చేస్తుంటాడని, అప్పుల బాధతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని తెలిపాడు. పోలీసులు బంగారు గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే దొంగను పట్టుకోవడంతో సీఐ రాజేశ్వరరావు టౌన్ ఎస్ఐ ఫిరోజ్ ను అభినందించారు.



Share:

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నుండి నరసరావుపేట బయలుదేరిన నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వచ్చి దారిలో అమీన్ సాహెబ్ పాలెం సమీపంలోని బసిక పురం గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లో కి వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అనంతరం వెనక నుండి వచ్చే ఆర్టీసీ బస్సు లో మిగిలిన ప్రయాణికులను ఎక్కించి బస్సు డ్రైవర్ నరసరావుపేట డిపో కి ఘటనను వివరించారు.



Share:

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు ఎముకలు ఏమి విరిగిన శస్త్రచికిత్సతో కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు పొందినది పూనాటి కుటుంబం. అయితే ఆ కుటుంబం లో ఒకరైన వైద్య నిపుణులు పునాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. అవిసాపాలెం కట్టు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతటి గుర్తింపు కలిగిన వీరి వద్దకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. 1900 సంవత్సరం నుండి పూనాటి వీరయ్య చౌదరి తదనంతరం వారి కుమారులు ఇప్పుడు వారి మనవళ్లు, ముని మనవాళ్ళు, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. పూనాటి వెంకటేశ్వర్లు మృతి పట్ల గ్రామ పెద్దలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు.



Share:

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.

                                                VIDEO  మీకోసం 

Share:

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము -  చిలకలూరిపేట జనసేన పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయుటను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయి డెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని, ఇప్పుడు ఆ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన ఐదు వేల రూపాయలు ఉండవలసిన ఫీజులు 20000 ,పాతిక వేలు అవటం వలన ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది అని, అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే విధులు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జి వో నెంబర్ 46 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా వారికి జనసేన పార్టీ  అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, మునీర్ హసన్, కాకుమాను రమేష్ ,భాష, మల్ల కోటి,అమరేశ్వరి, కోటేశ్వరమ్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.



Share:

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 భాగంగా ఈరోజు భారత్ నమీబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న భారత్. మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్ లకు గాను 8 వికెట్ల కష్టానికి 132 పరుగులు చేసింది. నమీబియా మొదట తడబడి 100 లోపే స్కోర్ నమోదు చేస్తుంది - అని అందరూ అనుకున్నారు. కానీ 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ లక్ష్యఛేదనలో 152 ఓవర్లకే ఫినిష్ చేశారు. గెలిచిన ఓడటం ఏంటి అనుకోవచ్చు - కానీ భారత్ సెమీ ఫైనల్స్ వెళ్లాలంటే మరొక మ్యాచ్ గెలవాల్సి ఉంది. కానీ భారత్ అంతకుముందే రెండు మ్యాచ్లను ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ మాత్రం సెమీ ఫైనల్కు వెళ్లదు.

2021 టి-20లో భారత్ కు ఇది చివరి మ్యాచ్. దీంతోపాటుగా విరాట్ కోహ్లీ కి కెప్టెన్గా తన చివరి మ్యాచ్. అలాగే కోచ్ గా ఉన్న రవి శాస్త్రి కి కూడా ఇది చివరి మ్యాచ్. తరువాత జరగబోయే టి 20 లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. అలాగే టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పగ్గాలు చేపట్టనున్నారు.




Share:

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భార్య భర్తలు దుర్గాప్రసాద్, హైమావతి గాయపడ్డారు. అదే సమయంలో లో నరసరావుపేట నుంచి చిలకలూరిపేట కి వస్తున్న టౌన్ సిఐ రాజేశ్వరరావు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీఐ రాజేశ్వరరావు తీసుకున్న తక్షణ నిర్ణయానికి, మానవతా దృక్పథానికి హ్యాట్సాఫ్ తెలిపారు.





Share:

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్  మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలోఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి, లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు గుర్తించారు. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రధానంగా మార్కెట్ సెంటర్ లోని మెయిన్ బ‌జార్‌లో ట్రాఫిక్ పోలీస్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ లలో రోడ్లపైకి పార్కింగ్ వెహికల్స్ రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన దారుల వల్ల పాదచారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ సిఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.