దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ
చిలకలూరిపేట ఈనెల 8 వ తారీఖున పండరీపురం 8 వ లైను నందు అంబటిపూడి శారద అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా .. అది గమనించిన చైన్ స్నచర్ వెనకనుండి వచ్చి అమాంతం ఆమె మెడలోని మూడు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే టౌన్ పోలీస్ శాఖకు విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దుండగుడు పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్రబాబు గా గుర్తించారు. పోలీసు విచారణలో తాను పెయింట్ వర్క్ చేస్తుంటాడని, అప్పుల బాధతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని తెలిపాడు. పోలీసులు బంగారు గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే దొంగను పట్టుకోవడంతో సీఐ రాజేశ్వరరావు టౌన్ ఎస్ఐ ఫిరోజ్ ను అభినందించారు.
No comments:
Post a Comment