ఈర్షతో ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు - నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి - MLA రజిని
చిలకలూరిపేట పట్టణంలో YSRCP ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ CM జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఓర్వలేక ఈర్ష్యతో పట్టాభి లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు స్క్రిప్టుని అందించి CM జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాగే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆమె తెలిపారు. టిడిపి పార్టీ రాష్ట్రంలో తమ ఉనికిని కోల్పోతున్న భయంతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని YSRCP నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు YSRCP యూత్ భారీగా పాల్గొన్నారు.